India Coronavirus Cases: ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. 3 శాతం లోపు వృద్ధిరేటు

  • Published By: sreehari ,Published On : August 24, 2020 / 01:58 PM IST
India Coronavirus Cases: ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. 3 శాతం లోపు వృద్ధిరేటు

Updated On : August 24, 2020 / 2:13 PM IST

India Coronavirus Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ మహమ్మారి కేసుల్లో వృద్ధిరేటు కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. మే చివరి తర్వాత మొదటిసారిగా రాష్ట్రంలో కేసుల వృద్ధి రేటు రోజుకు 3 శాతం కంటే తక్కువగా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటికీ ప్రతిరోజూ 8,000 నుంచి 10,000 మధ్య కొత్త కేసులు నమోదవుతున్నాయి.

మహారాష్ట్ర తరువాత మాత్రమే చాలా ఎక్కువ వృద్ధి రేటును సాధించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది.. నెల క్రితం ఏపీ దాదాపు 10 శాతం వృద్ధి రేటును తాకింది. కరోనా కేసుల సంఖ్య నిరంతరం పెరగడంతో ఏపీలో ప్రతి జిల్లాలో కనీసం 15వేల కేసులు నమోదయ్యాయి.



తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు 50వేల మందికి కరోనా సోకింది. కర్నూలు (39,000 కేసులతో), అనంత్‌పూర్ (35,000) గుంటూరు (30,000) జనాభాతో పోలిస్తే చాలా ఎక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడును అధిగమించింది.

ఒకటి లేదా రెండు వారాల్లో రెండవ అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రంగా అవతరించింది. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో 3.53 లక్షల కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 3.79 లక్షల కేసులు ఉన్నాయి. ఢిల్లీలో 1,450 కొత్త కేసులు నమోదయ్యాయి. నెలలోపు అత్యధిక కేసులు నమోదయ్యాయి.



గత కొన్ని రోజులుగా రాజధానిలో అంటువ్యాధుల సంఖ్య మళ్లీ పెరగడం ప్రారంభమైంది. ఢిల్లీలో ఒక నెలకు పైగా రోజువారీ సంఖ్య క్రమంగా పడిపోతోంది. ఈ నెల మొదట్లో 1,000 కన్నా తక్కువకు పడిపోయింది. గత ఒక వారంలో నగరం స్థిరంగా 1,200కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.



ప్రతిరోజూ కోలుకుంటున్న వారి సంఖ్య కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో 10,000 కన్నా తక్కువకు పడిపోయాయి.. నగరంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 12,000 చేరువలో ఉంది.