KTR Tweet : జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా-కేటీఆర్ మరో ఆసక్తికర ట్వీట్
తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో కేటీఆర్ స్పందించారు. వివాదానికి తెరదించేలా, వాతావరణాన్ని కూల్ చేసేలా తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు.

Ktr Tweet
KTR Tweet : ఏపీలో అభివృద్ధి గురించి, మౌలిక వసతుల కల్పన గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో తెలియాలంటే తెలంగాణ ప్రజలను పొరుగు రాష్ట్రానికి పంపాలని తన మిత్రుడు చెప్పాడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి. ఏపీలో కరెంట్ సరిగా లేదని, నీళ్లు కూడా లేవని, అభివృద్ధి జరగడం లేదని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని తన మిత్రుడు చెప్పారంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ కాక రేపాయి.
KTR Comments : డేట్, టైమ్ చెప్పు కేటీఆర్!.. ఏపీ మొత్తం తిప్పి చూపిస్తా
కేటీఆర్ కామెంట్స్ పై ఏపీ మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ నేతలు వరుసబెట్టి తీవ్రంగా స్పందిస్తున్నారు. కేటీఆర్ కు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. టైమ్, డేట్ చెప్పు కేటీఆర్.. ఏపీ మొత్తం తిప్పి చూపిస్తా అని మంత్రి రోజా అంటే.. నాలుగు కాదు 400 బస్సుల్లో ఏపీకి వచ్చి ఏపీ చూడండి అని మరో మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. జగన్ సీఎం అయ్యాక ఏపీ బాగా డెవలప్ అయ్యిందని, ఓసారి ఏపీకి వచ్చి చూడాలని, ఆ తర్వాతే మాట్లాడాలని కేటీఆర్ కు సూచించారు ఏపీ మంత్రులు.
Peddireddy Counter To KTR : ఓట్ల కోసమే ఏపీపై విమర్శలు-కేటీఆర్కు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్
తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో కేటీఆర్ స్పందించారు. వివాదానికి తెరదించేలా, వాతావరణాన్ని కూల్ చేసేలా తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. ”ఈరోజు ఒక మీటింగ్లో నేను చేసిన అమాయకపు వ్యాఖ్య ఏపీలోని నా స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండవచ్చు. నేను ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారితో గొప్ప సోదర సమీకరణాన్ని ఆనందిస్తున్నా. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా” అని ట్వీట్ చేశారు. శుక్రవారం రాత్రి 11 గంటల 40 నిమిషాలకు కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. మరి కేటీఆర్ తాజా ట్వీట్ తో అయినా వైసీపీ నేతలు శాంతిస్తారో లేదో, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.(KTR Tweet)
కేటీఆర్ ఏమన్నారంటే..
ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో కరెంట్ సరిగ్గా లేదని, నీళ్లు కూడా లేవని, అభివృద్ధి జరగడం లేదని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని తన
మిత్రులు చెప్పారంటూ వ్యాఖ్యానించారు.
”ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు. నీళ్లు లేవు. రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి. ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన నా మిత్రులు ఈ విషయాన్ని నాతో చెప్పారు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉందంటున్నారు. బెంగళూరులోని కంపెనీలు కూడా ఏపీలోని అధ్వాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయి. అదే తెలంగాణ విషయానికి వస్తే.. చాలా ప్రశాంతమైన రాష్ట్రం. దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైంది. నగరాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయకపోతే వెనుకపడిపోతాం. ఏపీతో పోలిస్తే తెలంగాణలో మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయి” అని కేటీఆర్ అన్నారు. ఏపీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపాయి.
It appears that an innocuous comment that I had made at a meeting earlier today may have caused some unintentional pain to my friends in AP
I enjoy a great brotherly equation with AP CM Jagan Garu & wish that the state prospers under his leadership
— KTR (@KTRTRS) April 29, 2022