జిల్లాల ఇష్యూస్కు ఎండ్కార్డ్ పడబోతోందా? ఏపీ రాజధాని అమరావతి ఒక కొత్త జిల్లాగా..
ఏపీ రాజధాని అమరావతి ఒక కొత్త జిల్లాగా ఆవిర్భవిస్తుందని ఎప్పటినుంచో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.
Amaravati: జిల్లాల ఇష్యూపై ఏపీ సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తోంది. వైసీపీ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏర్పడిన గందరగోళానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించింది క్యాబినెట్ సబ్కమిటీ.
ఇక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేదే ఆసక్తి రేపుతోంది. ఏపీలో ప్రస్తుతమున్న 26 జిల్లాలను 32 జిల్లాలుగా చేయాలనుకుంటోందట కూటమి సర్కార్. ఎన్నికల హామీ ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటుకు కూడా సాధ్యాసాధ్యాలపై ఆరా తీస్తోందట. ఏపీలో కొత్త జిల్లాలుగా ఆరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. (Amaravati)
శ్రీకాకుళం జిల్లాలోని పలాసను విడదీస్తూ కొత్త జిల్లా చేయబోతున్నారట. అలాగే మార్కాపురం, మదనపల్లె, గూడూరు, రాజంపేట కొత్త జిల్లాలు అవుతాయని అంటున్నారు. ఏపీ రాజధాని అమరావతి ఒక కొత్త జిల్లాగా ఆవిర్భవిస్తుందని ఎప్పటినుంచో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. కొన్ని జిల్లాల విస్తీర్ణం ఎక్కువ..తక్కువ ఉండటంతో పాటు జిల్లా కేంద్రాల దూరం..ఇలా పలు ఇష్యూస్ అన్నింటిని సెట్రైట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.
Also Read: హైదరాబాద్లో కాల్పుల కలకలం.. దొంగపై కాల్పులు జరిపిన సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య
మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చే నివేదికను క్యాబినెట్లో పెట్టి చర్చించే అవకాశం ఉందట. త్వరలో జనగణన చేపట్టనుండటంతో..2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పులకు అవకాశం లేదు. ఈ ఏడాది డిసెంబరు 31లోగానే జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులను డిసైడ్ చేసి అమలు చేయాల్సి ఉంటుంది.
2026 జనవరి 26 నుంచి కొత్త జిల్లాలు..
ఈ లోగానే క్యాబినెట్లో డిస్కస్ చేసి ఆమోదం తెలుపుతారని అంటున్నారు. ఇక 2026 జనవరి 26 నుంచి కొత్త జిల్లాలను అమలు లోకి తీసుకొచ్చే అంశం పరిశీలనలో ఉందట. కొత్త జిల్లాలు ఏర్పాటు అయితే ఏపీలో జిల్లా సంఖ్య 32కి చేరుతుంది. తెలంగాణలో విభజన తర్వాత 10 ఉమ్మడి జిల్లాలు ఉంటే కేసీఆర్ హయాంలోనే 33 జిల్లాలుగా చేశారు.
తెలంగాణ కంటే జనాభా పరంగానూ అలాగే భౌగోళికంగానూ పెద్దది అయిన ఏపీలో మాత్రం 2022 దాకా 13 జిల్లాలే ఉన్నాయి. ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నా..జిల్లా కేంద్రాలు, సరిహద్దులు, పేర్ల వివాదం నడుస్తోంది. ఈ సమస్యలన్నింటికి చెక్ పెడుతూ ఆరు కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయట.
ఈ రెండు నెలల్లో జిల్లాల ఇష్యూస్కు ఎండ్కార్డ్ పడకపోతే..మరో 15 నెలలు ఆగాల్సి ఉంటుంది. అప్పుడు ఎన్నికల ముంచుకొస్తాయి కాబట్టి..జిల్లాల ఎపిసోడ్కు ఇప్పుడే ఏదో ఒక పరిష్కారం వెతికే పనిలో ఉందట కూటమి సర్కార్.
