Police Protection For Amaravati Farmers : అమరావతి రైతుల‌కు ర‌క్ష‌ణ‌గా 400మంది పోలీసులు.. గుడివాడలో కట్టుదిట్టమైన భద్రత

పోలీసులు రైతులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. 400 పోలీసుల రక్షణ మధ్య రైతులు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. రోడ్డంతా పోలీసులు రక్షణగా నిల్చుంటే.. పోలీసుల మధ్య నుంచి రైతులు పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

Police Protection For Amaravati Farmers : అమరావతి రైతుల‌కు ర‌క్ష‌ణ‌గా 400మంది పోలీసులు.. గుడివాడలో కట్టుదిట్టమైన భద్రత

Updated On : September 24, 2022 / 6:01 PM IST

Police Protection For Amaravati Farmers : అమరావతి రైతుల మహా పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడలోకి ఎంటర్ అయ్యింది. పోలీసులు రైతులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. 400 పోలీసుల రక్షణ మధ్య రైతులు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. రోడ్డంతా పోలీసులు రక్షణగా నిల్చుంటే.. పోలీసుల మధ్య నుంచి రైతులు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఎవరైనా పాదయాత్రను అడ్డుకుంటే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

గుడివాడలో అమరావతి రైతుల మహా పాదయాత్రపై కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. జిల్లా నలుమూలల నుంచి 400 మందికిపైగా పోలీసులు, అధికారులు గుడివాడకు చేరుకున్నారు. గుడివాడలోని మార్కెట్ యార్డులో అధికారులు, పోలీసులకు రూట్లు కేటాయించారు. ముందస్తు చర్యగా వజ్ర వాహనాలు, ఎస్వోటీ టీమ్ లు రంగంలోకి దిగాయి. వీధుల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

అమరావతి నుంచి అరసవల్లికి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడలోకి ప్రవేశించింది. గుడివాడ ప్రజలు రైతులకు సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చారు. రైతుల పాదయాత్ర నేపథ్యంలో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడొచ్చన్న నేపథ్యంలో పట్టణంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. పెద్ద ఎత్తున రోప్ పార్టీ పోలీసులను రంగంలోకి దించారు. గుడివాడ చేరుకున్న రైతులను పోలీసులు రోప్ ల నడుమ ముందుకు తీసుకెళుతున్నారు. ప్రస్తుతం కట్టుదిట్టమైన భద్రత మధ్య రైతుల పాదయాత్ర కొనసాగుతోంది.

కాగా, గుడివాడలో రైతుల పాదయాత్ర నేపథ్యంలో, టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చింతమనేని గుడివాడ వెళతారన్న అంచనాల నేపథ్యంలో ఏలూరులోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.