పులివెందులలో ఆర్టీసీ బస్సు బోల్తా .. 40అడుగుల లోతులో పడిన బస్సు

కడప జిల్లా పులివెందులలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కదిరి నుంచి పులివెందులకు వెళ్తుండగా పులివెందులలోని డంప్ యార్డ్ వద్ద

పులివెందులలో ఆర్టీసీ బస్సు బోల్తా .. 40అడుగుల లోతులో పడిన బస్సు

Buss Accident

Updated On : October 23, 2024 / 10:16 AM IST

RTC Bus Accident : కడప జిల్లా పులివెందులలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కదిరి నుంచి పులివెందులకు వెళ్తుండగా పులివెందులలోని డంప్ యార్డ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దాదాపు 40 అడుగుల లోతులో బస్సు పడిపోయింది.

 

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటన స్థలికి చేరుకొని బస్సులోని వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పులివెందుల ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా.. 15మందికి స్వల్పగా గాయాలయ్యాయి.