Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం.. ఈనెల 28న ఢిల్లీకి .. ఎందుకంటే?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 28న ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో అక్రమంగా ఓట్ల తొలగింపు వ్యవహారంపై ..

Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం.. ఈనెల 28న ఢిల్లీకి .. ఎందుకంటే?

Chandrababu naidu

TDP Chief Chandrababu Naidu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 28న ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో అక్రమంగా ఓట్ల తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. వాలంటీర్ల ద్వారా తెలుగుదేశం, వైసీపీ అనుకూల ఓట్ల సమాచారం సేకరించి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని చంద్రబాబు ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఓట్ల అక్రమాలపై ఉరవకొండ, పర్చూరు, విజయవాడ సెంట్రల్, విశాఖ తదితర ఘటనల సాక్ష్యాలను సీఈసీకి చంద్రబాబు అందించనున్నట్లు సమాచారం. దీనికితోడు తెలుగుదేశం నేతలు అందించిన ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవట్లేదనికూడా సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి.

Yuvagalam Padayatra: గన్నవరంలో వంశీకి చెక్‌పెట్టే దిశగా టీడీపీ అడుగులు.. భారీ బహిరంగ సభ.. లోకేశ్ స్పీచ్‌పై అందరిలోనూ ఆసక్తి

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు వ్యవహారం రాష్ట్రం పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఈ వ్యవహారంలో విచారణ జరిపిన అధికారులు గతంలో అనంతపురంలో జడ్పీ సీఈవోగా పనిచేసిన శోభా స్వరూపారాణిపై సప్పెండ్ వేటు వేశారు. అంతకుముందు ఇప్పటి జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డిపైనా ప్రభుత్వం సస్పెండ్ వేటు వేసింది. ఉరవకొండ నియోజకవర్గంలో 2020, 2021 సంవత్సరాల్లో టీడీపీ మద్దతుదారులకు చెందిన ఓట్లను నోటీసులు ఇవ్వకుండా అధికారులు తొలగించారని స్థానిక ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ గతేడాది అక్టోబర్ నెలలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సదరు అధికారులపై చర్యలు తీసుకుంది.

Bandi Sanjay : భక్తులు తిరుమలకు రాకుండా చేస్తున్నారు, వేంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవు- బండి సంజయ్ సీరియస్ వార్నింగ్

ఏపీలో అధికార వైఎస్ఆర్ సీపీ సానుభూతి పరుల దొంగ ఓట్లు చేర్చడం జరుగుతుందని, టీడీపీ అనుకూల ఓట్లను తొలగిస్తున్నారని గత కొంతకాలంగా టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ మేరకు పలు దఫాలుగా అధికారులకుసైతం ఫిర్యాదు చేశారు. దీనికితోడు ఏపీలో ఓట్ల జాబితాలో అక్రమాలపై సమాచార సేకరణకు ఇప్పటికే టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. తాజాగా ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై సీఈసీ ఆదేశాలతో ఇద్దరు అధికారులపై వేటు పడింది. ఉరవకొండ నియోజకవర్గం తరహాలోనే రాష్ట్రంలో అనేక చోట్ల ఓట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో చంద్రబాబు గతంలో, ప్రస్తుతం ఓట్ల తొలగింపుపై వచ్చిన ఫిర్యాదులన్నింటిని సీఈసీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.