కరోనా నెగెటివ్ వస్తే మళ్లీ పరీక్షలు

కరోనా వైరస్ అనుమానితుల పరీక్షలకు ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వాడాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కోరింది. జిల్లాలకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లను పంపినట్లు పేర్కొంది. యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్ తేలితే వెంటనే చికిత్స ప్రారంభించాలని సూచించింది. రోగిని ఐసోలేషన్ చేయాలని కలెక్టర్లు, డీఎంహెచ్ వోలకు సూచించింది.
కరోనా లక్షణాలు ఉండి యాంటీజెన్ పరీక్షలో నెగెటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ చేయాలని ఆదేశించింది. అందులోనూ నెగెటివ్ వస్తే మరోమారు రియల్ టైమ్ లో ఆర్టీపీసీఆర్ చేయాలని కోరింది. హైరిస్కులు గల ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో విరివిగా పరీక్షలు చేయాలని సూచించింది.
వ్యాధి లక్షణాలు కలిగి కరోనా నెగెటివ్ ఫలితాలు వచ్చినా పరీక్షించాలని కోరింది. గర్భిణీలు, శస్త్రచికిత్స చేయాల్సిన రోగుల పరీక్షకు, ఆస్పత్రుల్లో చేరేటప్పుడు అనుమానితుల పరీక్షలకు ఈ కిట్లు వాడాలని ఆదేశించింది.