Police Attacked Woman : చిత్తూరులో ‘జై భీమ్‌’ సినిమా తరహా ఘటన.. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిచి మహిళపై దాడి

చిత్తూరు జిల్లా జైలు సూపరిండెంట్‌ వేణుగోపాల్‌ రెడ్డి ఇంట్లో పనిమనిషిగా ఉన్న బాధితురాలిపై కుటుంబ సభ్యులు చోరి నేరం మోపారు. ఈనెల 18న వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో రూ.2లక్షలు మాయం అయ్యాయి.

Police Attacked Woman : చిత్తూరులో ‘జై భీమ్‌’ సినిమా తరహా ఘటన.. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిచి మహిళపై దాడి

Police Attack

Updated On : January 23, 2022 / 2:44 PM IST

Police Attacked Woman in chittoor : చిత్తూరులో జై భీమ్‌ తరహా ఘటన జరిగింది. చేయని తప్పుకు పోలీసులు తనను చిత్ర హింసలు పెట్టారని ఓ మహిళ ఆరోపిస్తోంది. చిత్తూరు జిల్లా జైలు సూపరిండెంట్‌ వేణుగోపాల్‌ రెడ్డి ఇంట్లో పనిమనిషిగా ఉన్న బాధితురాలిపై కుటుంబ సభ్యులు చోరి నేరం మోపారు. ఈ నెల 18న వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో 2 లక్షల రూపాయలు మాయం అయ్యాయి. ఈ డబ్బును బాధితురాలే తీసిందంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు విచారణకు పిలిచారు. విచారణ పేరుతో తనను కొట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తీవ్రంగా కొట్టి… చివరకు నేరం రుజువు కాకపోవడంతో తనను వదిలి వేశారని బాధితురాలు చెబుతోంది. ప్రస్తుతం తాను కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Murdered : భార్యపై అనుమానం.. ఇద్దరి ప్రాణాలు తీసింది

విన్నారుగా.. చేయ్యని నేరానికి బాధితురాలు శిక్ష అనుభవించింది. ఈ ఘటన జరిగి ఇన్ని రోజులైనా ఆమె ఇంకా కోలుకులేదంటే పోలీసుల ట్రీట్‌మెంట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బయట నోరు తెరవద్దు, ఆసుపత్రి ఖర్చులు కూడా తామే ఇస్తామని సుమతి శతకాలు చెప్పిన ఖాకీలు పీఎస్‌ దాటగానే ఆ విషయం మర్చిపోయారు.

చచ్చి చేడి బాధితురాలే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటే అక్కడికి కూడా వచ్చారని బాధితురాలు అంటోంది. పోలీసులు చేసిన నిర్వాకానికి తాను ఇప్పుడు నడిచే పరిస్థితిలో లేనంటోంది బాధితురాలు. చేయ్యని నేరానికి తనను హింసించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్‌ చేస్తోంది.

Boy Died : బైక్‌ చక్రంలో చిక్కుకుని బాలుడు మృతి

అదీ పోలీసుల వరుస. బాధితురాలిపై దొంగతనం ఆరోపణలు ఉన్నాయి.. విచారణనకు పిలిచారు. అక్కడి వరకు బాగానే ఉంది. మరి ఆమెపై చేయి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పనిమనిషే కదా అని చులకనా? ఏం చేసినా అడిగే వారు లేరన్న ధైర్యమా? ఓ మహిళను విచారించేప్పుడు లేడీ కానిస్టేబుల్ అక్కడ ఎందుకు లేదు? మగ కానిస్టేబులే ఎందుకు విచారణ జరపాల్సి వచ్చింది? ఇంతకీ ఆ 2 లక్షలు ఎక్కడ దొరికాయి? ఈ కేసులో బాధితురాలిని కావాలనే ఇరికించారా? వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చిత్తూరు పోలీసులదే.