Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి అస్వస్థత.. జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు..

ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం వంశీ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి అస్వస్థత.. జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు..

Vallabhaneni Vamsi

Updated On : May 13, 2025 / 5:54 PM IST

Vallabhaneni Vamsi : టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుల్లో అరెస్ట్ అయ్యి విజయవాడ జైల్లో ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస కోశ, గొంతు సమస్యలతో వంశీ ఇబ్బంది పడుతున్నారు. దీంతో వంశీని జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీ విజ్ఞప్తి మేరకు జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. వంశీకి వైద్యులు వైద్య పరీక్షలు చేయనున్నారు.

Also Read: వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి జగన్ రూ.25 లక్షల సాయం

కాగా, వంశీకి మళ్లీ నిరాశే ఎదురైంది. ఆయన రిమాండ్ ను విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. రేపటి వరకు వంశీ రిమాండ్ ను పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజుతో రిమాండ్ ముగియనుండటంతో పోలీసులు వంశీని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం వంశీ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పోలీసులు వంశీని మళ్లీ విజయవాడ జైలుకి తరలించారు.

 

ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే వంశీ, ఆయన అనుచరులు ఫిర్యాదుదారైన సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి దాడి చేశారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. తాము చెప్పినట్లు వినకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని అంతమొందిస్తామని సత్యర్ధన్ ను బెదిరించి తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఈ మేరకు కేసు దర్యాప్తు అధికారి, సెంట్రల్‌ ఏసీపీ దామోదర్‌ సోమవారం విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు.