Ys Sharmila : బాబుగారు.. చేతులు కాలాక ఏం పట్టుకున్నా ఉపయోగం లేదు, డీ లిమిటేషన్‌పై వెంటనే స్పందించండి- వైఎస్ షర్మిల

డీ లిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతుంటే.. ఏపీ సీఎం చంద్రబాబు స్పందించకపోవడం తగదు.

Ys Sharmila : బాబుగారు.. చేతులు కాలాక ఏం పట్టుకున్నా ఉపయోగం లేదు, డీ లిమిటేషన్‌పై వెంటనే స్పందించండి- వైఎస్ షర్మిల

Updated On : March 13, 2025 / 5:40 PM IST

Ys Sharmila : డీ లిమిటేషన్ ద్వారా సౌత్ స్టేట్స్ పై నిజంగా బీజేపీది ప్రతికారమే అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రభావం లేనందుకే ఈ కక్ష్య సాధింపు చర్యని బీజేపీపై మండిపడ్డారు. పార్లమెంట్ లో సౌత్ ప్రాతినిథ్యం తగ్గించే కుట్రలో భాగమే అని ఆరోపించారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యం అన్నారు. జనాభా ప్రాతిపదికన డీ లిమిటేషన్ చేయడం అంటే.. కుటుంబ నియంత్రణ పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నట్లే అని షర్మిల వ్యాఖ్యానించారు.

”1971 తర్వాత సౌత్ కంటే నార్త్ లోనే అత్యధిక జనాభా పెరిగింది. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుంటే 8 కోట్ల నుంచి 24 కోట్ల జనాభా పెరిగింది. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం యూపీలో 80 నుంచి 143 సీట్లకు అదనంగా పెరుగుతున్నట్లే. బీహార్ లో 40 నుంచి 79 కి పెరిగే స్థానాలు కలుపుకుంటే.. రెండు రాష్ట్రాల నుంచే 222 ఎంపీలు పార్లమెంట్ లో ప్రాతినిథ్యం వహించే పరిస్థితి.

Also Read : రాములమ్మ ఎంట్రీతో ఇబ్బందికరంగా మారింది ఎవరికి? ఏ లీడర్‌కు చెక్‌ పెట్టేందుకు తీసుకొచ్చారు?

ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం పెరిగే సీట్లు 12 మాత్రమే. అంటే 42 నుంచి 54కి మాత్రమే. సౌత్ రాష్ట్రాల్లో పెరిగే సీట్లు పదుల సంఖ్యలో ఉంటే, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ సంఖ్య వందలాదిగా ఉంటోంది. డీ లిమిటేషన్ పై బీజేపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా అఖిలపక్షం ఏర్పాటు చేయాలి.

 

Also Read : విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారడం ఖాయమా? జగన్‌తో రాజీ ముచ్చటే లేదనడానికి రీజనేంటి?

డీ లిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతుంటే.. ఏపీ సీఎం చంద్రబాబు స్పందించకపోవడం తగదు. దాటవేసే ధోరణి అవలభించడం అన్యాయం. బీజేపీతో కూటమి పొత్తులో ఉన్నారని మౌనం వహిస్తే.. చేతులు కాలాక ఏం పట్టుకున్నా ఉపయోగం లేదని చంద్రబాబు గ్రహించాలి. డీ లిమిటేషన్ పై మీ వైఖరి వెంటనే చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం” అని షర్మిల అన్నారు.