వైసీపీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం, ఆందోళనలో సీఎం జగన్

  • Published By: naveen ,Published On : September 6, 2020 / 03:45 PM IST
వైసీపీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం, ఆందోళనలో సీఎం జగన్

Updated On : September 6, 2020 / 4:13 PM IST

కరోనా బారిన పడిన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆరోగ్యం విషమించింది. అత్యవసర చికిత్స కోసం ఎమ్మెల్యే దొరబాబును బెంగుళూరు తరలించాలని డాక్టర్లు చెప్పారు. దాంతో వెంటనే ఆయనను ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదివారం(సెప్టెంబర్ 6,2020) బెంగళూరు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కరోనా బారిన పడిన ఎమ్మెల్యే దొరబాబు కొంతకాలంగా కాకినాడలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇంతలోనే సీరియస్ కావడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించాలని డాక్టర్లు చెప్పారు.

కరోనా బారిన పడ్డ 30మందికిపైగా ఎమ్మెల్యేలు:
ఏపీలో కరోనా వైరస్ వణికిస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో వేల సంఖ్యలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. కరోనా వైరస్ ప్రజలకు ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తోంది. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అంతా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో 30మందికిపైగా ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు, డిప్యూటీ సీఎంలు కోవిడ్ కు గురయ్యారు. చాలా మంది కరోనా నుండి కోలుకున్నారు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.