DA Hike 2025 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ కానుక.. డీఏ పెంపుపై భారీ ప్రకటన..? జీతం, పెన్షన్ ఎంత పెరుగుతుందో తెలుసా?

DA Hike 2025 : 2025 మార్చిలో హోలీ బొనాంజగా అధికారిక ప్రకటన వెలువడవచ్చు. జనవరి నుంచి మార్చి వరకు బకాయిలు చెల్లించవచ్చు. గత ఏడాది అక్టోబర్‌లో, ప్రభుత్వం డీఏ, డీఆర్ 3శాతం పెంచగా 53శాతానికి చేరింది.

DA Hike 2025 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ కానుక.. డీఏ పెంపుపై భారీ ప్రకటన..? జీతం, పెన్షన్ ఎంత పెరుగుతుందో తెలుసా?

DA Hike 2025

Updated On : March 5, 2025 / 3:46 PM IST

DA Hike 2025 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2025లో హోలీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల కోసం భారీ ప్రకటన చేయనుంది. హోలీకి ముందు కేంద్రం ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అందించవచ్చని అనేక మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఏడాదిలో మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంపుదల (డీఏ) ప్రకటించవచ్చనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా డీఏ, డీఆర్‌లో రాబోయే పెంపుదల ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 7వ వేతన సంఘం కింద వేతనాలు చెల్లిస్తారని గమనించాలి.

Read Also : 8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు బిగ్ షాక్? జీతాలు పెరగడం లేదా ఏంటి? 8వ వేతన సంఘం లేటెస్ట్ అప్‌డేట్ ఇదిగో..!

ఇప్పటివరకు ఏడాదికి రెండుసార్లు డీఏ, డీర్ పెంచుతూ వస్తున్నారు. మొదటిసారి డీఏ పెంపు జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుంది. రెండోసారి డీఏ పెంపు జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. 2025 మొదటి డీఏ పెంపు జనవరి 1, 2025 నుంచి అమలులోకి రానుందని గమనించాలి.

2025 మార్చిలో హోలీ బొనాంజగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత జనవరి నుంచి మార్చి వరకు బకాయిలు చెల్లించనుంది. ముఖ్యంగా, గత ఏడాది అక్టోబర్‌లో, ప్రభుత్వం డీఏ, డీఆర్ 3శాతం పెంచి 53శాతానికి పెంచింది. ఈ ఏడాది కూడా డీఏను 3 శాతానికి పెంచే అవకాశం ఉంది. అదేగానీ జరిగితే 53 శాతం నుంచి 56 శాతానికి చేరవచ్చు. హోలీ సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన రావచ్చు.

డీఏ, డీఆర్ పెంపు ఎంత ఉండొచ్చుంటే? :
కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్‌లో 3 శాతం నుంచి 4శాతం పెరుగుదలను ప్రకటించవచ్చు. ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీస వేతనంగా రూ. 18వేలు పొందుతున్నారు. అదే సమయంలో, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కనీస పెన్షన్‌గా రూ. 9వేలు పొందుతున్నారు.

పెన్షనర్లు, ఉద్యోగుల కొత్త జీతం  (అంచనా) :
ఉద్యోగులకు డీఏ పెంపు :
ఒక ఉద్యోగికి ప్రస్తుతం కనీస వేతనం రూ. 18వేలు ఉంటే జనవరి 2025కి డీఏ 3శాతం పెరిగితే, వారి కనీస వేతనం రూ. 540 పెరుగుతుంది. ప్రస్తుత 53శాతం డీఏ కింద రూ. 27,540 జీతం (కనీస మూల వేతనం + డీఏ) పొందవచ్చు. అయితే, డీఏని 56శాతానికి పెంచితే రూ. 28,080 జీతం వస్తుంది. ఒకవేళ డీఏ 4శాతం పెరిగితే అది 57శాతం అవుతుంది. ఈ రేటు ప్రకారం.. కనీస వేతనం నెలకు రూ.720 పెరిగి రూ.28,260 అవుతుంది.

Read Also : Moto E50 Pro : ఫ్లిప్‌కార్ట్‌‌లో అదిరే ఆఫర్.. ఈ మోటో ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. లిమిటెడ్ టైమ్ అంట.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

పెన్షనర్ల డీఏ పెంపు :
ఒక వ్యక్తికి ప్రస్తుతం కనీస పెన్షన్ రూ. 9వేలు అయితే జనవరి 2025కి డీఏ 3శాతంగా పెరిగితే కనీస వేతనం రూ. 270 పెరుగుతుంది. ప్రస్తుత 53శాతం డీఏ కింద రూ. 13,770 పెన్షన్ (కనీస మూల వేతనం+డీఏ)కు అర్హులు. డీఏని 56శాతానికి పెంచితే రూ. 14,040 చెల్లిస్తుంది. డీఏ 4శాతం పెరిగితే 57శాతానికి చేరుతుంది. అంటే.. కనీస జీతం నెలకు రూ.360 పెరిగి రూ.14,130 అవుతుంది.

జులై- సెప్టెంబర్ డేటాను పరిశీలిస్తే.. ఈ మార్చిలోనే డీఏ పెంపుపై భారీ ప్రకటన ఉండవచ్చు. అంటే.. డీఏ 55.98 శాతానికి చేరొచ్చు. మొత్తంగా డీఏ 56 శాతానికి పెరిగే ఛాన్స్ ఉంది. 3 శాతం డీఏ పెరిగే అవకాశం ఉంది. డీఏ పెంపుతో కేంద్ర ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో పడే మొత్తం జీతం పెరుగుతుంది. ఉద్యోగి బేసిక్ పేపైనే వర్తిస్తుందని గమనించాలి.