Gold: మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్.. దేశంలో పసిడి రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడే కొంటే..
ఇవాళ దేశంలో వెండి ధరల్లో కిలోకి రూ.2,000 పెరుగుదల కనపడింది

Gold
బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.80,650గా ఉంది.
అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే.. పసిడి ధర రూ.490 పెరిగి రూ.87,980గా ఉంది. హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.
ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.450 పెరిగి ఇవాళ ఉదయం నాటికి రూ.80,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.490 పెరిగి రూ.88,130గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,650గా ఉంది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,980గా ఉంది.
ఇవాళ దేశంలో వెండి ధరల్లో కిలోకి రూ.2,000 పెరుగుదల కనపడింది
ఏ నగరాల్లో ఎలా?
- హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.1,09,000గా ఉంది
- విజయవాడలో కిలో వెండి ధర రూ.1,09,000గా ఉంది
- విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,09,000గా ఉంది
- ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00,000గా ఉంది
- ముంబైలో కిలో వెండి ధర రూ.1,00,000గా ఉంది
భారత్లో బంగారం ధరలు ప్రతిరోజు గంటల వ్యవధిలో మారుతుంటాయి. గ్లోబల్ మార్కెట్ పరిస్థితులతో పాటు దేశీయంగా ఉన్న డిమాండ్ వంటివి ఇందుకు కారణాలు. బంగారం కొనుగోలుదారులు తాము కొంటున్న సమయంలో మార్కెట్లో ఉన్న ధరలను పరిశీలించాలి.

Gold
ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగానూ సెంట్రల్ బ్యాంకులు కూడా పసిడిని అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. దేశంలో ఆర్థిక అనిశ్చితి నుంచి బంగారం ధరలు బయటపడేస్తాయన్న కారణంతో సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాయి. భారత్ కూడా పెద్ద మొత్తంలో పసిడిని దిగుమతి చేసుకుంది.