Gold Rate : మరోసారి భారీగా పెరిగిన గోల్డ్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఇలా..

అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగడంతో దేశీయంగానూ ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల అమెరికాలో వెలువడిన ద్రవ్వోల్బణ గణాంకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి.

Gold Rate : మరోసారి భారీగా పెరిగిన గోల్డ్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఇలా..

Gold

Gold Rate in Hyderabad : బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. రోజురోజుకు గోల్డ్ ధర రికార్డు స్థాయిలో పెరుగుతోంది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ పై రూ. 750 పెరగ్గా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 760 పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగానేకాక.. తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు 80వేల మార్క్ కు చేరుకున్నాయి.

Gold

అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగడంతో దేశీయంగానూ ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల అమెరికాలో వెలువడిన ద్రవ్వోల్బణ గణాంకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. దీంతో జూన్ నుంచి వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో గోల్డ్ కు డిమాండ్ పెరిగింది. దీనికితోడు చైనా నుంచి డిమాండ్ పెరగడమూ బంగారం పెరుగుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇదిలాఉంటే.. వెండిధరసైతం భారీగా పెరిగింది. బుధవారం కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ. 81వేలకు చేరింది.

Gold

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,100 మార్క్ కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69,870 కి చేరింది.

Gold

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,250 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 70,020.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 64,100 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 69,870.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.65,000 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.70,910కు చేరింది.

Gold

  • పెరిగిన వెండి ధర ..
    దేశం వ్యాప్తంగా వెండి ధర భారీగా పెరిగింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.81,000 మార్క్ కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 84,000. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.81,000 కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.79,000 వద్ద కొనసాగుతుంది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు