PM Kisan : రైతులకు బిగ్ అలర్ట్.. మీ ఆధార్‌లో పేరు తప్పుందా? ఈ 5 తప్పులు ఉంటే.. పీఎం కిసాన్ రూ. 2వేలు పడవు..!

PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. మీ ఆధార్ కార్డులో పేరుతో పీఎం కిసాన్ అకౌంటుతో సరిపోలడం లేదా? ఈ తప్పులను సరిదిద్దుకోండి..

PM Kisan : రైతులకు బిగ్ అలర్ట్.. మీ ఆధార్‌లో పేరు తప్పుందా? ఈ 5 తప్పులు ఉంటే.. పీఎం కిసాన్ రూ. 2వేలు పడవు..!

PM Kisan Yojana

Updated On : June 26, 2025 / 6:30 PM IST

PM Kisan 20th Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-Kisan) 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 20వ విడత విడుదల ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

నివేదికల ప్రకారం.. జూన్ చివరి వరకు లేదా జూలై ప్రారంభంలో 20వ విడత డబ్బులు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, రైతులు తమ వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి.

Read Also : Redmi Note 14 : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. చౌకైన ధరకే కొత్త రెడ్‌మి ఫోన్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

రూ. 2వేలు పడే లోగా రైతులు తమ ఆధార్‌తో పేరు సరిపోలకపోవడం, బ్యాంకు అకౌంట్ యాక్టివ్ లేకపోవడం వంటి తప్పు వివరాలను వెంటనే సరిచేసుకోవాలి. ఈ లోపాలను ఎంత తొందరగా సరిచేసుకుంటే అంత మంచిది. ఇంతకీ ఏయే తప్పులను ఎలా సరిచేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం..

ఈ చిన్నపాటి తప్పులను సరిచేసుకోండి :

  • చిన్న చిన్న లోపాల కారణంగా పీఎం కిసాన్ డబ్బులు రావు.
  • పీఎం కిసాన్ రికార్డులు, ఆధార్ మధ్య పేరు మిస్ మ్యాచ్ కావడం
  • బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా లేకపోవడం
  • ఇంటి అడ్రస్ తప్పులు ఉండటం.
  •  బ్యాంక్ అకౌంట్ లేదా మొబైల్ నంబర్‌లో తప్పుగా పడటం.

ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి :
పీఎం కిసాన్ చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి 6వేలు 3 విడతలుగా అందిస్తుంది. ఈ పథకం ఆధార్ ధృవీకరణ కలిగిన రైతులకు మాత్రమే వర్తిస్తుంది. పేరు లేదా ఇతర వివరాలలో చిన్న తప్పు కూడా ఉండకూడదు. లేదంటే రూ. 2వేలు బ్యాంకు ఖాతాలో పడవు.

ఆధార్‌తో పేరు మిస్ మ్యాచ్.. ఎలా ఫిక్స్ చేయాలి? :

  • మీ పేరును ఆన్‌లైన్‌లో కరెక్ట్ చేసుకోవచ్చు.
  • అధికారిక PM కిసాన్ వెబ్‌సైట్‌ (https://pmkisan.gov.in)ను విజిట్ చేయండి.
  • ‘Farmer Corner’ పై క్లిక్ చేయండి.
  • ‘Updation of Self Registered Farmer’ ఎంచుకోండి.
  • మీ ఆధార్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయండి.
  • ఆధార్ కార్డులో కనిపించే విధంగానే మీ పేరును అప్‌డేట్ చేసి Submit చేయండి.

ఆఫ్‌లైన్ నేమ్ కరెక్షన్ కోసం ఆధార్, ల్యాండ్ రికార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పీఎం కిసాన్ ఐడీతో సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సందర్శించండి.

20వ విడతకు ముందు ఈ విషయాలను చెక్ చేయండి :

  • e-KYC ని పూర్తి చేయడం తప్పనిసరి
  •  మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో ఇంటిగ్రేషన్ యాక్టివ్‌గా ఉండాలి.
  •  బ్యాంక్, ఆధార్, పీఎం కిసాన్ పోర్టల్‌లో పేరు స్పెల్లింగ్ సరిగ్గా సరిపోతుందో లేదో చెక్ చేయండి.
  •  రాష్ట్ర ప్రభుత్వ ఆమోదించిన ల్యాండ్ రికార్డులను వెరిఫై చేయండి.
  •  ఫేక్ రిజిస్ట్రేషన్లు చేయొద్దు. మల్టీ ఎంట్రీలతో బ్లాక్ అవుతుంది.
  •  మొబైల్ నంబర్, మీ ఇంటి అడ్రస్ కరెక్ట్ ఉండాలి.

e-KYC ఎందుకు తప్పనిసరి? :
పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం.. eKYC తప్పనిసరిగా ఉండాలి. eKYC లేకుండా ఏ రైతు రూ. 2వేలు పొందలేరు. eKYCని రెండు విధాలుగా పూర్తి చేయవచ్చు. OTP ఆధారిత eKYC (మొబైల్ నంబర్ లింక్) చేయొచ్చు. CSC కేంద్రాన్ని విజిట్ చేసి బయోమెట్రిక్స్ ద్వారా eKYC ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

Read Also : Vivo X Fold 5 : వివో కొత్త ఫోన్ చూశారా? మడతబెట్టే ఫోన్ అంట.. ట్రిపుల్ కెమెరా ఫీచర్లు హైలెట్.. ధర ఎంతైనా కొని తీరాల్సిందే..!

మీ ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :

  • అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in) వెళ్లండి.
  • ‘Know Your Status’పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • మీరు స్క్రీన్‌పై ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్ చూడవచ్చు.