PM Kisan : బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు పడేది అప్పుడే.. ఈలోగా ఈ పని పూర్తి చేయండి!

PM Kisan : పీఎం కిసాన్ డబ్బుల కోసం చూస్తున్నారా? 20వ విడత వచ్చే జూన్‌‌లో విడుదల కావొచ్చు. ఈలోగా కొన్ని పనులను పూర్తి చేయాలి. అవేంటో ఓసారి చూద్దాం..

PM Kisan : బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు పడేది అప్పుడే.. ఈలోగా ఈ పని పూర్తి చేయండి!

PM Kisan 20th Installment

Updated On : April 19, 2025 / 3:47 PM IST

PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత డబ్బుల కోసం చూస్తున్నారా? మరో రెండు నెలల్లో పీఎం కిసాన్ డబ్బులు పడనున్నాయి. 19వ విడత డబ్బులు అందుకున్న రైతులంతా ఇప్పుడు 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also : BSNL 5G SIM : గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లోనే BSNL 5G సిమ్ ఆర్డర్ చేయొచ్చు.. ఇలా చేస్తే.. 90 నిమిషాల్లో హోం డెలివరీ..!

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత వచ్చే జూన్ 2025లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పథకం 20వ విడతలో భాగంగా రూ. 2వేలు అర్హత గల రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి. దాదాపు 10 కోట్ల మంది రైతులు ఈ పీఎం కిసాన్ పథకం ప్రయోజనాన్ని పొందనున్నారు.

పీఎం కిసాన్ పథకంలో మీ పేరుతో రిజిస్టర్ చేసుకోండి. అయితే, రైతుల అకౌంటులో రూ. 2వేలు పడాలంటే ముందుగా కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు పథకానికి సంబంధించిన అవసరమైన అన్ని వివరాలను పూర్తి చేయకపోతే.. వాయిదాల డబ్బు నిలిచిపోతుంది. ఫలితంగా మీ అకౌంట్లలో డబ్బులు పడవు. రైతులు ముందుగా ఈ కింది పనులను తప్పక పూర్తి చేయాలి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

పీఎం కిసాన్ e-KYC ఎలా పూర్తి చేయాలంటే? :
సమ్మాన్ నిధి యోజన 20వ విడత ప్రయోజనాన్ని పొందాలనుకుంటే.. ముందుగా, కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిసారి రైతులు ముందుగా భూమి ధృవీకరణ పొందాలి. అంతేకాదు.. రైతులు తమ e-KYC కూడా పూర్తి చేయాలి. రైతులు వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

Read Also : Amazon Sale : ట్రిపుల్ కెమెరా ఫోన్ కావాలా? మోటో ఎడ్జ్ 50ప్రోపై భారీ డిస్కౌంట్.. ఇంకా ధర తగ్గాలంటే..!

  • మీరు పీఎం కిసాన్ (https://pmkisan.gov.in/) పోర్టల్‌ను విజిట్ చేయాలి.
  • వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత KYC ఆప్షన్ క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  • OTP ఎంటర్ చేశాక Submit బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఇలా e-KYCని పూర్తి చేయొచ్చు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏడాదికి రూ.6వేలు చొప్పున 3 వాయిదాలలో పొందవచ్చు. ఒక్కొక్కటి 3 నెలలకు రైతులు వాయిదాల్లో పొందవచ్చు. ఈ పథకం కింద నమోదు చేసుకున్న రైతుల సంఖ్య 12 కోట్లకు దాటింది. అయితే, అన్ని అర్హతలు కలిగిన రైతులు మాత్రమే పీఎం కిసాన్ ప్రయోజనాలను పొందవచ్చు.