Premchand Godha : ఈ బిలియనీర్ ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ సీఏ.. ఇప్పుడు రూ.21వేల కోట్ల కంపెనీకి అధిపతి..!

Premchand Godha : రూ. 21వేల కోట్ల ఫార్మా కంపెనీకి నాయకత్వం వహిస్తున్న ఈ 77 ఏళ్ల బిలియనీర్ ఒకప్పుడు బచ్చన్ కుటుంబానికి చార్టర్డ్ అకౌంటెంట్ (CA)గా పనిచేశారు.

Premchand Godha : ఈ బిలియనీర్ ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ సీఏ.. ఇప్పుడు రూ.21వేల కోట్ల కంపెనీకి అధిపతి..!

Premchand Godha

Updated On : December 22, 2024 / 3:11 PM IST

Premchand Godha : ఈ బిలియనీర్ ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ సీఏ.. ఇప్పుడు రూ.21వేల కోట్ల కంపెనీకి అధిపతి అయ్యాడు. ఆయన ఎవరో కాదు.. ఇప్కా లేబొరేటరీస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రేమ్‌చంద్ గోధా, 1.7 బిలియన్ డాలర్ల నికర సంపదతో అత్యంత సంపన్న భారతీయులలో ఒకరు. ఈ మొదటి తరం వ్యవస్థాపకుడు రైతు కుటుంబంలో జన్మించాడు. ఇప్పుడు భారత్‌లోని అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. తన వ్యూహాత్మక ఆలోచన, వ్యాపార చతురతతో తన నాయకత్వంలో ప్రస్తుతం రూ. 21వేల కోట్ల విలువైన ఫార్మా కంపెనీని నెలకొల్పారు.

అంతేకాదు.. 1.7 బిలియన్ డాలర్లు ( ₹ 14,435 కోట్లు) నికర విలువతో అత్యంత సంపన్న భారతీయులలో ఇప్కా లేబొరేటరీస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రేమ్‌చంద్ గోధా ఒకరు. అంతగా తెలియని విషయం ఏమిటంటే.. రూ. 21వేల కోట్ల ఫార్మా కంపెనీకి నాయకత్వం వహిస్తున్న ఈ 77 ఏళ్ల బిలియనీర్ ఒకప్పుడు బచ్చన్ కుటుంబానికి చార్టర్డ్ అకౌంటెంట్ (CA)గా పనిచేశారు. దీనివల్ల ఆయన ఫైనాన్స్‌లో విలువైన నైపుణ్యాన్ని పెంపొందించుకుని తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.

బాల్యం, విద్యాభ్యాసం :
రాజస్థాన్‌లోని రైతు కుటుంబంలో జన్మించిన గోధా రాజస్థాన్ యూనివర్శిటీ నుంచి వాణిజ్యశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత అతను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యాడు. ఆయన వృత్తి జీవితం 1971లో ప్రారంభమైంది. ప్రారంభ సంవత్సరాల్లో ఆయన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో సహా మొత్తం బచ్చన్ కుటుంబం అన్ని ఆర్థిక వ్యవహారాలను నిర్వహించారు.

ఇప్కా ఎలా ఆవిర్భంచిందంటే ? :
గోధా, బచ్చన్ కుటుంబం ఇప్కా లేబొరేటరీస్‌లో పెట్టుబడి పెట్టడం 1975 ఒక మలుపు. అప్పట్లో ఫార్మా కంపెనీ పతనం అంచున ఉంది. ఇప్కా లాబొరేటరీస్‌ నుంచి గోధా వ్యవస్థాపక శక్తిగా మారింది. నష్టాల్లో ఉన్న సంస్థ నుంచి ఫార్మా కంపెనీ లాభదాయక సంస్థగా మారిపోయింది. నివేదిక ప్రకారం.. ఆయన నాయకత్వంలో, కంపెనీ ఆదాయం సంవత్సరాల్లో రూ. 54 లక్షల నుంచి రూ. 4,422 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బచ్చన్ కుటుంబం 1999లో ఫార్మా కంపెనీలో తమ వాటాను విక్రయించింది.

గోధా 31 అక్టోబర్ 1975 నుంచి డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు. మార్చి 1983 నుంచి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎల్‌పీసీఏ లేబొరేటరీస్ ఎంతో అభివృద్ధి చెందింది. రూ. 21,298 కోట్ల మార్కెట్ విలువతో (శుక్రవారం ముగింపు) భారత మార్కెట్లో అత్యంత ప్రసిద్ధ ఔషధ కంపెనీలలో ఒకటిగా అవతరించింది.

Read Also : Indian-Origin CEO : ఈ 4 అలవాట్లతో ఏకంగా 45 కిలోల బరువు తగ్గిన భారత సంతతి సీఈఓ.. పోస్టు వైరల్..!