Twitter: ఢిల్లీ, ముంబై ఆఫీసుల్ని మూసేసిన ట్విట్టర్.. ఇండియాలో మిగిలింది ఇక ఒక్కటే ఆఫీస్
ఇండియా ఇంటర్నెట్ రంగంలో ఇప్పటికీ మెటా, గూగుల్ వంటి సంస్థలే ముందంజలో ఉన్నాయి. కొద్ది కాలం క్రితం నుంచే భారత జనస్వామ్యంలో ప్రభావవంతమైన పబ్లిక్ ఫ్లాట్ ఫాంలలో ఒకటిగా ట్విట్టర్ ఆదరణ పొందింది. పైగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ఖాతాకు 86.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ ట్విట్టర్కు తగినంత ఆదాయం లేనట్లు సమాచారం

Twitter shut two of its three India offices, staff to work from home
Twitter: భారతదేశంలోని మూడు కార్యాలయాల్లో రెండింటిని ట్విట్టర్ మూసివేసింది. ఈ రెండు కార్యాలయాల్లో ఉన్న సిబ్బందికి ఇంటి నుండి పని చేయమని ఆదేశాలు జారీ చేసింది. ఖర్చులను తగ్గించుకుంటూ సోషల్ మీడియా సేవల్ని అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ పేర్కొంది. గత ఏడాది చివర్లో భారతదేశంలోని దాదాపు 200 మందికి పైగా సిబ్బందిలో 90 శాతం మందిని తొలగించిన ట్విట్టర్, రాజకీయ కేంద్రం న్యూఢిల్లీ, ఆర్థిక కేంద్రమైన ముంబైలోని తన కార్యాలయాలను మూసివేసినట్లు ప్రకటించడం గమనార్హం.
Ramcharitmanas Row: షాకింగ్ నిర్ణయం తీసుకున్న సమాజ్వాదీ పార్టీ.. ఆ ఇద్దరు మహిళా నేతలపై వేటు
ఇక ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులోని దక్షిణ టెక్ హబ్లో ఎక్కువ మంది ఇంజనీర్లు ఉన్న కార్యాలయాన్ని మాత్రమే ట్విట్టర్ కొనసాగిస్తోంది. కొద్ది రోజుల క్రితమే ట్విట్టర్ను హస్తగతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. 2023 చివరి నాటికి ట్విట్టర్ను ఆర్థికంగా స్థిరీకరించే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగుల తొలగింపు, కార్యాలయాల మూసివేత వంటివి పెద్ద ఎత్తున చేపట్టారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సిబ్బందిని తొలగించారు. అలాగే చాలా దేశాల్లో కార్యాలయాలను మూసివేశారు.
Haryana: హర్యానాలో కిరాతకం.. ఇద్దరు ముస్లింల సజీవ దహనం.. గోసంరక్షకులపై కేసు నమోదు
ఇండియా ఇంటర్నెట్ రంగంలో ఇప్పటికీ మెటా, గూగుల్ వంటి సంస్థలే ముందంజలో ఉన్నాయి. కొద్ది కాలం క్రితం నుంచే భారత జనస్వామ్యంలో ప్రభావవంతమైన పబ్లిక్ ఫ్లాట్ ఫాంలలో ఒకటిగా ట్విట్టర్ ఆదరణ పొందింది. పైగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ఖాతాకు 86.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ ట్విట్టర్కు తగినంత ఆదాయం లేనట్లు సమాచారం. అయినప్పటికీ పోటీలో నిలదొక్కుకుని నిలబడడానికి బదులు ఇండియాలో ఇంటర్నెట్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇలాంటి తరుణంలో ట్విట్టర్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రతికూల ప్రభావాన్ని చూపించొచ్చని అంటున్నారు.