విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసు నిందితులకు 14 రోజులు రిమాండ్

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకైన ఘటనలో అరెస్ట్ అయిన కంపెనీ ప్రతినిధులకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. జూమ్ మ్యాప్ ద్వారా నిందుతులను విచారించిన తర్వాత మెజిస్ట్రేట్ వారికి ఈ నెల 22వరకు రిమాండ్ విధించింది. గ్యాస్ లీకేజ్ ఘటనలో కంపెనీ సీఈఓతో సహా 12 మందిని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కంపెనీ యాజమాన్యం వల్లే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగిందని విశాఖ ద్వారక జోన్ ఏసీపీ మూర్తి అన్నారు. సాంకేతిక అంశాల ఆధారంగా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని నిర్ధారించుకున్నట్లు ఆయన అన్నారు. 12మంది ప్రతినిధులపై పలు సెక్షన్ ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు సౌత్ కొరియన్స్ ఉన్నారని తెలిపారు. ఎండీ కమ్ సీఈవో, టెక్నికల్ అడ్వైజర్ కూడా ఉన్నారు. వారితోపాటు కంపెనీలో పని చేసే పది మంది ఇండియన్స్ కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
మంగళవారం అరెస్టు చేసి బుధవారం ఉదయం కోర్టు ఎదుట హాజరు పరిచామని తెలిపారు. మేజిస్ట్రేట్ ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారని తెలిపారు. సుమారు 300 పైగా విట్ నెస్ లను విచారించామని, ఇంకా చాలా మందిని విచారణ చేయాల్సివుందన్నారు. స్వతంత్రంగా తమ విచారణ కొనసాగిందన్నారు. దీనికి టెక్నికల్ అంశాలు ముడిపడి ఉన్నాయని కాబట్టి హైపవర్ కమిటీలో అంతర్భాగం వారు నివేదికలు కోరారని తెలిపారు.
304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసు చాలా తీవ్ర తరమైన కేసు అని, ఏడేళ్ల పైగా శిక్ష పడే కేసులని, వాటి ప్రకారం వీరిని అరెస్టు చేశామని తెలిపారు. 338, 337, 286 ఐపీసీ సెక్షన్లు ఉన్నాయని అంటే ఎవరు దేనికి లైవ్ బుల్ అవుతారు, ఎంతవరకు అవుతారో చూసి తర్వాత విచారణ చేసిన తర్వాత నిర్దారణ చేయాల్సివుంటుందన్నారు. సెషన్స్ కోర్టు స్థాయిలో విచారణ అయ్యే సెక్షన్లను పెట్టామని తెలిపారు. ఎవరిదైనా పాత్ర ఉంటే వారిని వారిని కూడా అరెస్టు చేస్తామని చెప్పారు.