ఢిల్లీలో నిన్న అగ్నిప్రమాదం జరిగిన భవనంలో మరోసారి మంటలు

ఢిల్లీలోని అనాజ్ మండిలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. నిన్న అగ్నిప్రమాదం జరిగిన భవనంలో సోమవారం (డిసెంబర్ 9, 2019) మరోసారి మంటలు చెలరేగాయి.

  • Published By: veegamteam ,Published On : December 9, 2019 / 03:32 AM IST
ఢిల్లీలో నిన్న అగ్నిప్రమాదం జరిగిన భవనంలో మరోసారి మంటలు

Updated On : December 9, 2019 / 3:32 AM IST

ఢిల్లీలోని అనాజ్ మండిలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. నిన్న అగ్నిప్రమాదం జరిగిన భవనంలో సోమవారం (డిసెంబర్ 9, 2019) మరోసారి మంటలు చెలరేగాయి.

ఢిల్లీలోని అనాజ్ మండిలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. నిన్న అగ్నిప్రమాదం జరిగిన భవనంలో సోమవారం (డిసెంబర్ 9, 2019) మరోసారి మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. నాలురు ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఆదివారం (డిసెంబర్ 8, 2019) జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది మృతి చెందారు. మరో 22 మందికిపైగా గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. 

ఆదివారం (డిసెంబర్ 8, 2019) ఝాన్సీ రోడ్‌లోని అనాజ్ మండీలో ఈ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అనాజ్‌మండీలో ఆరంతస్తుల భవనంలో ప్లాస్టిక్ ఫ్యాకర్టీ ఉంది. ఆదివారం తెల్లవారుజామున ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సమయంలో అందులో పనిచేస్తున్న 100 నుంచి 150 కార్మికులు నిద్ర పోయారు. గాఢ నిద్రలో ఉండడంతో ప్రమాద విషయం తెలియలేదు. తెలిసేసరికి అప్పటికే ఆలస్యం అయిపోయింది. తప్పించుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భారీగా పొగ కమ్ముకోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. ఊపిరిఆడక చాలా మంది సృహ తప్పిపడిపోయారు. మంటల్లో సజీవ దహనమయ్యారు. 

అగ్నిప్రమాదం వార్త తెలియగానే ఫైర్ సిబ్బంది స్పందించారు. 30కి పైగా ఫైరింజన్లు మంటలను అదుపు చేసే పనిలో పడ్డాయి. భవనంలో చిక్కుకున్న 56మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. ప్లాస్టిక్ సామగ్రి కావడంతో మంటలు వేగంగా విస్తరించాయి. వెంటనే పక్కనే ఉన్న రెండు భవనాలకు కూడా మంటలు పాకాయి. చుట్టూ ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో ఎటూ కదల్లేని పరిస్థితి. మొత్తంగా 43 మంది చనిపోయారు. పొగ కారణంగానే ఎక్కువమంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువమంది కూలీలే. వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిగా భావిస్తున్నారు.