కాలువలోకి దూసుకెళ్లిన కారు : ఇద్దరు యువకులు గల్లంతు

  • Published By: veegamteam ,Published On : October 26, 2019 / 11:01 AM IST
కాలువలోకి దూసుకెళ్లిన కారు : ఇద్దరు యువకులు గల్లంతు

Updated On : October 26, 2019 / 11:01 AM IST

నిర్మల్ జిల్లాలో జెన్‌ కారు కాలువలోకి దూసుకెళ్లింది. దాస్తురాబాద్ మండలం, రేవోజిపేట్ గ్రామం వద్ద కడెం ప్రధాన కాలువలోకి ప్రమాదవశాత్తూ కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు శ్రమించి.. తాడు సాయంతో కారును వెలికితీశారు. ఈ ప్రమాదంలో గల్లంతైన యువకులు జన్నారం మండలకేంద్రానికి చెందిన శశాంక్, సాయిసంగీత్‌గా గుర్తించారు.