దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై సజ్జనార్

కీలక ఆధారాలు దాచిపెట్టినట్లు చెప్పారు. వాటిని సేకరించేందుకు ఇక్కడకు తీసుకువచ్చిన తర్వాత కాసేపటి వరకూ తటపటాయించి పారిపోయే క్రమంలో నలుగురు చేరి గుంపుగా దాడి చేయడం మొదలుపెట్టారు. 

దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై సజ్జనార్

Updated On : December 6, 2019 / 9:58 AM IST

కీలక ఆధారాలు దాచిపెట్టినట్లు చెప్పారు. వాటిని సేకరించేందుకు ఇక్కడకు తీసుకువచ్చిన తర్వాత కాసేపటి వరకూ తటపటాయించి పారిపోయే క్రమంలో నలుగురు చేరి గుంపుగా దాడి చేయడం మొదలుపెట్టారు. 

హైదరాబాద్ లో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సీపీ సజ్జనార్ స్పందించారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలోనే మీడియా మిత్రులతో మాట్లాడారు. డిసెంబరు 2నుంచి డిసెంబరు 12వరకూ కస్టడీలో ఉంచమని ఆదేశాలు వచ్చాయి. కేస్ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా విచారణ కోసం షాద్ నగర్ ప్రాంతానికి తీసుకొచ్చారు. 

అక్కడ నిందితులు ఫోన్‌తో పాటు మరికొన్ని కీలక ఆధారాలు దాచిపెట్టినట్లు చెప్పారు. వాటిని సేకరించేందుకు ఇక్కడకు తీసుకువచ్చిన తర్వాత కాసేపటి వరకూ తటపటాయించి పారిపోయే క్రమంలో నలుగురు చేరి గుంపుగా దాడి చేయడం మొదలుపెట్టారు.  రాళ్లు రువ్వుతూ.. పోలీసు రివాల్వర్ లాక్కొని దాడి చేయాలనుకున్నారు. చెన్నకేశవులు, మహ్మద్ పాషా ఆయుధాలు లాక్కున్నారు. వారికి 10మంది పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి.

కాసేపటి వరకూ జరిగిన కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారు. వారితో పాటు ఓ కానిస్టేబుల్, నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లకు కూడా గాయాలయ్యాయి. తలకు గాయం కావడంతో దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి తర్వాత కేర్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నాం. 

ఈ ఘటన ఉదయం 5గంటల 15నిమిషాల నుంచి 6గంటల మధ్యలో జరిగింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి అరకిలోమీటర్ దూరంలో దిశ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నాం. దొరికిన వస్తువుల్లో పవర్ బ్యాంక్, ఫోన్, వాచ్ దొరికాయి. నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తున్నారు.