షాకింగ్ : వరకట్నం కోసం ఆరేళ్ల పిల్లలు కూడా వేధించారు

కుటుంబంతోపాటు నలుగురు పిల్లలు కొత్త కోడలిని వరకట్నం కోసం వేధించారు. కుటుంబంతోపాటు పిల్లలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Published By: veegamteam ,Published On : October 30, 2019 / 02:43 AM IST
షాకింగ్ : వరకట్నం కోసం ఆరేళ్ల పిల్లలు కూడా వేధించారు

Updated On : October 30, 2019 / 2:43 AM IST

కుటుంబంతోపాటు నలుగురు పిల్లలు కొత్త కోడలిని వరకట్నం కోసం వేధించారు. కుటుంబంతోపాటు పిల్లలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కుటుంబంతోపాటు నలుగురు పిల్లలు కొత్త కోడలిని వరకట్నం కోసం వేధించారు. పోలీసులు కుటుంబంతోపాటు పిల్లలపై కేసు నమోదు చేశారు. ఇదేం అన్యాయం అంటూ ఆ పిల్లలు హైకోర్టును ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గుంటూరు జిల్లా చంద్రాపురానికి చెందిన పొన్నెకంటి బిందుకు ఆదరణ కుమార్‌తో గత ఏడాది వివాహం జరిగింది. తన భర్త, అత్తమామలు, ఆడపడుచులు, వారి భర్తలు తనను అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారంటూ (సెప్టెంబర్‌ 26, 2019 గుంటూరు పట్టణ మహిళా పోలీస్‌స్టేషన్‌లో బిందు ఫిర్యాదు చేశారు. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు బిందు భర్తతో పాటు అత్త, మామలు, రేణుక, సిల్వన్‌ రాజు, నాయనమ్మ వజ్రమ్మ, ఆడపడుచులు జయకుమారి, సరళ, సంధ్య, పద్మ, వీరి భర్తలు రాజేశ్, నిరీక్షణరావు, రాజేంద్రకుమార్‌లను నిందితులుగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా 6, 6, 9, 11 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడపడుచుల కుమారులు, కుమార్తెలు నలుగురుని కూడా నిందితుల జాబితాలో చేర్చారు. వీరిపై కూడా వరకట్న వేధింపుల నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టారు. 

దీంతో ఆ చిన్నారులు హైకోర్టును ఆశ్రయించారు. పెద్దలతో సహా తమపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. చిన్నారులను నిందితులుగా చేర్చడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని పిటిషనర్లు వివరించారు. ఈ పిటిషన్ పై హైకోర్టు బుధవారం (అక్టోబర్ 30, 2019) విచారణ జరిపే అవకాశం ఉంది.