రిపబ్లిక్ డే వేళ అసోంలో పేలుళ్లు

దేశమంతా 71వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటుంటే… అసోంలో ఉగ్రవాదులు గ్రనేడ్ లు పేల్చి కలకలం సృష్టించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగుకుండా భద్రత కట్టుదిట్టం చేసినప్పటికీ ఈశాన్యభారతంలో ఉగ్రవాదులు నాలుగు చోట్ల పేలుళ్లు జరిపి ఉనికి చాటుకున్నారు.
ఆదివారం ఉదయం అసోంలోని దిబ్రూగఢ్, చరైదేవ్, దులియాజాన్ ప్రాంతాల్లో పేలుళ్లు జరిపారు. కాగా ఈ పేలుళ్ళలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. దిబ్రూగఢ్ జిల్లాలోని గ్రాహమ్ బజారు వద్ద ఒకటి, ఏటీ రోడ్డులోని గురద్వారా వద్ద ఒకటి పేలుడు జరగ్గా, మరోకటిదిబ్రూగఢ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. చరైడియా జిల్లాలోని సోనారికి సమీపంలోని టియాక్ ఘట్ టినియాలి సమీపంలోని ఒక దుకాణం ముందు మరోపేలుడు సంభవించింది. మరోకటి దులియాజాన్ పట్టణంలో జరిగింది.
ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు పేలుడు శకలాలను సేకరించారు. చరైడియా జిల్లాలోని సోనారి ఘటనలో .. బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు అక్కడ గ్రేనైడ్ ఉంచి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ పేలుళ్లు నిషేధిత తీవ్రవాద సంస్ధ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ అసోం ఇండిపెండెంట్ కు చెందిన పనిగా పోలీసులు భావిస్తున్నారు. రిపబ్లిక్ వేడుకలను బహిష్కరించాలని ఈసంస్ధ శనివారం పిలుపు నిచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈశాన్య భారతదేశంలోని పలు తీవ్ర వాద సంస్ధలు గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని పిలుపునిస్తు వస్తున్నాయి.
Assam: An explosion has taken place at a shop near NH 37 at Graham Bazaar in Dibrugarh. Police and other officers have reached the spot. More details awaited. https://t.co/7v6gghmBVt pic.twitter.com/2SrLpcwgxA
— ANI (@ANI) January 26, 2020