Road Accident : శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి వాహనాన్ని ఢీకొట్టిన లారీ

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను హిందూపురం, సిరా ఆసుపత్రులకు తరలించారు. మృతులు కాంతప్ప, ఆయన తల్లి అమ్మాజక్క రంగప్పగా పోలీసులు గుర్తించారు.

Road Accident : శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి వాహనాన్ని ఢీకొట్టిన లారీ

Road Accident

Sri Sathya Sai district : శ్రీ సత్య సాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అగలి మండలం ఇరిగేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రోళ్ల మండలం దాసప్ప పాల్యానికి చెందిన 14 మంది పెళ్లి వేడుక ముగించుకొని టాటా ఏసీలో వస్తున్నారు. ఈ క్రమంలో ఇరిగేపల్లి వద్ద ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ టాటా ఏసీ వాహనాన్ని ఢీకొట్టింది.

Also Read : Road Accident : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను హిందూపురం, సిరా ఆసుపత్రులకు తరలించారు. మృతులు కాంతప్ప, ఆయన తల్లి అమ్మాజక్క రంగప్పగా పోలీసులు గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని తెలుస్తోంది. సిమెంట్ లారీ వేగంగా వచ్చి టాటా ఏసీని ఢీనడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.