గుజరాత్ లో 9 మంది ఇరాన్ జాతీయుల అరెస్టు

గుజరాత్ లో 9 మంది ఇరాన్ జాతీయులను అరెస్టు చేశారు. సముద్ర మార్గంలో బోటు ద్వారా మాదక ద్రవ్యాలు తరలిస్తున్నారన్న సమాచారంతో కోస్ట్గార్డ్, మెరైన్ టాస్క్ఫోర్స్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. సముద్రంలో బోటు నుంచి 9 మంది ఇరాన్ జాతీయులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి వంద కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇతర సాక్ష్యాలను మాయం చేసేందుకు నిందితులు బోటుకు నిప్పు పెట్టారు. పూర్తిగా కాలిపోయిన అనంతరం దుండగుల బోటు సముద్రంలో మునిగిపోయింది.