Girl Rape : బాలికపై తండ్రీ ఇద్దరు కొడుకులు అత్యాచారం..మత్తుమందు ఇచ్చి రెండు నెలలుగా చిత్రహింసలు

బాలికను ఇంట్లో బంధించి తండ్రీ ఇద్దరు కొడుకులు అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు నెలలుగా మత్తుమందు ఇచ్చి చిత్రహింసలు పెట్టారు.

Girl Rape : బాలికపై తండ్రీ ఇద్దరు కొడుకులు అత్యాచారం..మత్తుమందు ఇచ్చి రెండు నెలలుగా చిత్రహింసలు

Two Sons And Father Gang Raped The Girl

Updated On : November 5, 2021 / 3:56 PM IST

two sons and father gang raped the girl : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే బిడ్డల పాలిట కామాంధుడిగా మారిన ఘటనలు మనుషులా? పశువులా అనిపిస్తున్నాయి. చెల్లెలికి కొండంత అండగా నిలవాల్సిన అన్న చెల్లెలిపై అత్యాచారాలకు తెగబడుతున్న దారుణాలు. ఇటువంటి సమాజంలో ఇక ఆడపిల్లలు ఎలా భత్రతతో బతకగలరు? అనే ప్రశ్న భయాందోళనలకు గురిచేస్తోంది. ఇటువంటి దారుణాలు ఆడపిల్లల పుట్టుకనే ప్రశ్నార్థం చేస్తున్నాయి. అటువంటి దారుణ ఘటనే జరిగింది హర్యానాలో. తండ్రీకొడుకులు కలిసి తొమ్మిదో తరగతి చదివే బాలికపై అత్యాచారానికి తెగబడ్డారు. ఒకసారి కాదు..తాగిన మైకంలోను కాదు. మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన ఇది ఆటవిక సమాజమా? అనిపిస్తోంది.

Read more : Woman Dress Changing : ట్రయల్‌రూమ్ లో బట్టలు మార్చుకుంటుండగా వీడియో తీసిన యువకులు

రెండు నెలలుగా తండ్రీ కొడుకులు ఆ బాలికపై అత్యాచారం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనపై జరుగుతున్న దారుణ కాండ ఏంటో తెలియని ఆ అమ్మాయకురాలు క్రూర మృగాలబారిని పడిన లేడిపిల్లలా అల్లాడిపోయింది. హర్యానాలోని పానిపట్​ జిల్లాలో తొమ్మిదో తరగతి చదువుకుంటున్న బాలికపై పొరుగుంట్లో ఉంటున్న తండ్రీకొడుకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి ఒడిగట్టారు.పానిపట్​లోని మోడల్​ టౌన్​లో బాలిక కుటుంబ సభ్యులతో ఉంటోంది. వాళ్ల ఇంటిపక్కనే ఉంటున్న అజయ్​ అనే యువకుడు.. ఆ బాలికను ప్రేమిస్తున్నానంటు వెంటపడ్డాడు. చిన్న వయస్సు నిజమా? కాదా? అని కూడా ఆలోంచే పరిపక్వత లేని వయస్సు. దీంతో అతని మాటలు నిమ్మింది. ఈ క్ర‌మంలో ఆ బాలికను అజయ్​ తన ఇంటికి తీసుకెళ్లాడు.

అప్పటికి అజయ్ తండ్రి, అతని సోదరుడు అర్జున్ ఇంట్లోనే ఉన్నారు. బాలికపై అత్యాచారం చేస్తుంటే తప్పు అని చెప్పాల్పిన తండ్రి గానీ సోదరుడు గానీ చెప్పలేదు. పైగా ఇద్దరు కలిసి అజయ్ ను ప్రోత్సహించారు. అలా కాదు ఇలా చేయాలి అంటూ ప్రోత్సహించారు. ఎలా హింసించారో దగ్గరుండి మరీ నేర్పించారు. అలా మత్తుమందు కలిగిన ఓ సిగరెట్ ఇచ్చి ఆ బాలికను కాల్చమన్నారు ముగ్గురు కలిసి. బాలిక ఏడుస్తుంటే ముగ్గురు కలిసి ఎంజాయ్ చేశారు.

Read more : Bengaluru : ఆ వీడియోలు చూడొద్దన్న భార్య..భర్త ఏం చేశాడంటే

ఇదంతా ఊరికనే సరదాకే అంటూ నమ్మించారు. నేను చెప్పినట్లుగా వింటే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను.అని చెప్పాడు అజయ్. అంత హింస అనుభవిస్తు కూడా ఆ అమాయకురాలు అతని మాటలు నమ్మింది. అలా ఆమెపై వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు. అలా ఒక రోజు రెండు రోజులు కాదు రెండు నెలలు బాలికను తమ ఇంట్లోనే బంధించి.. రాక్ష‌స క్రీడ కొన‌సాగించారు. ప్రతీ రోజు డ్ర‌గ్స్ ఇచ్చి అత్యాచారం చేసేవారు. మరోపక్క తన కూతురు కనిపించట్లేదని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు పట్టించుకోలేదు. ఇటువంటి కేసులు మాకు మామూలే వస్తుందిలే ఎక్కడికి పోతుంది అంటూ నిర్లక్ష్యం చేశారు. కానీ ఆ తల్లి పదే పదే పోలీసులు చుట్టు తిరగేది. నా కూతురు ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడా కనిపించలేదు..దయచేసి నా కూతుర్ని వెదికి పెట్టండీ సార్ అంటూ వేడుకుంది.కానీ పోలీసులు నిర్లక్ష్యం వీడలేదు.

ఇలా అస‌లు తనపై ఏం జ‌రుగుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితుల్లోకి బాలిక వెళ్లిపోయింది. అలా ఆమె శారీరకంగా..మానసిక ఆరోగ్యం క్షీణించింది. చివ‌రకు వారి బారి నుంచి తప్పించుకుని తన ఇంటికి చేరుకున్న బాలిక‌.. విషయాన్ని తల్లికి చెప్పి సొమ్మసిల్లి పడిపోయింది. తన కూతరు కనిపించట్లేదని ఎన్నిసార్లు పోలీసులకు మొర‌పెట్టుకున్నా.. వారు పట్టించుకోలేదని బాధితురాలి తల్లి వాపోయింది. కూతురు ఇంటికి చేరుకున్నాక కూడా పోలీసులకు మరోసారి తన కూతురు ఇంటికి చేరుకుందనీ..కానీ రెండు నెలల పాటు ఆమెపై అత్యాచారం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని మరోసారి పోలీసులకు చెప్పినా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తు..నాకూతురు జరిగిన విషయాన్ని పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని..కనీసం ఆమెకు ఎలాంటి వైద్య పరీక్షలు చేయించలేదని వాపోయింది.

Read more : Boyfriend Attack : కూతురుతో మాట్లాడవద్దు అన్నందుకు గర్ల్ ప్రెండ్ తండ్రిపై దాడి

పోలీసులు పట్టించుకోకపోవటంతో కూతుర్ని తీసుకుని తల్లి సీఎం నివాసానికి వెళ్లారు. తమ గోడు విన్నవించుకున్నారు. దీంతో స్పందించిన సీఎం తక్షణమే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేసి..నిందితుల్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలని ఆదేశించారు.దీంతో పోలీసులు అజయ్​, అర్జున్​, సదర్​ లతో పాటు ఇంట్లో ఇంత దారుణం జరుగుతుంటే..ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తుంటే పట్టించుకోని అజయ్​ తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.