ఉస్మానియా యూనివర్సిటీలో గుర్తు తెలియని మృతదేహం

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ చెరువు వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మరణించిన వ్యక్తికి 25 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని బండరాయితో మోది హత్య చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
డాగ్ స్క్వాడ్ తో , క్లూస్ టీంతో సంఘటనా స్ధలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. చనిపోయినవ్యక్తి, విద్యార్ధా, లేక బయటి వ్యక్తా అనే వివరాలు తెలియాల్సి ఉంది. కాచిగూడ ఏసీపీ సుధాకర్, ఓయూ సీఐ రాజశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోంది.