Hyderabad : హైదరాబాద్ బేగంపేటలో కలకలం.. గన్‌తో ఇంట్లోకి చొరబడ్డ దుండగులు, తల్లీకూతుళ్ల వీరోచిత పోరాటం..

సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

Hyderabad : హైదరాబాద్ బేగంపేటలో కలకలం.. గన్‌తో ఇంట్లోకి చొరబడ్డ దుండగులు, తల్లీకూతుళ్ల వీరోచిత పోరాటం..

Hyderabad : హైదరాబాద్ బేగంపేటలో కలకలం రేగింది. బేగంపేట జైన్ కాలనీలో దుండగులు గన్ తో (నాటు తుపాకీ) ఓ ఇంట్లోకి చొరబడ్డారు. పిస్తోలుతో బెదిరించి దోచుకోవడానికి ప్రయత్నించారు. అయితే, ఇంట్లో ఉన్న తల్లీ కూతురు ఎంతో ధైర్యంగా తిరగబడ్డారు. దొంగలతో వీరోచిత పోరాటం చేశారు. ఊహించని విధంగా తల్లీకూతుళ్లు ఎదురు తిరగడంతో దుండగులు బిత్తరపోయారు. అక్కడి నుంచి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఓ వ్యక్తి బ్యాగులో తుపాకీ పెట్టుకుని ఇంట్లోకి వెళ్లాడు. దుండగుడు ఇంట్లోకి చొరబడటం, తుపాకీతో ఇంట్లో వారిని బెదిరించడం, తల్లీ కూతురు దుండగుడిపైకి తిరగబడటం, వీరోచితంగా పోరాటం చేయడం, దొంగ చేతిలోని తుపాకీ లాక్కోవడం, దొంగలు అక్కడి నుంచి భయంతో పారిపోవడం.. ఇవన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.

పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు తెలిశాయి. ఏడాది క్రితం ఇంటి పని కోసం (ఇంటిని శ్రుభం చేసేందుకు) ఆగంతకులు వచ్చారు. అదే ఇంట్లో కొంతకాలం పని చేశారు. ఇంటి గుట్టు మొత్తం తెలుసుకున్నాక.. సంవత్సరం తర్వాత ప్రణాళిక అమలు చేశారు. దోపిడీకి యత్నించిన వారిలో ఒకరు పోలీసుల అదుపులో ఉండగా మరొకడు పరారీలో ఉన్నాడు. ఆ వ్యక్తి నుంచి పోలీసులు ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. బైక్ పై దోపిడీకి వచ్చారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు ఇంట్లోకి ప్రవేశించి తుపాకీతో బెదిరించి దోపిడీకి యత్నించాడని పోలీసులు తెలిపారు. తల్లీకూతుళ్ల వీరోచిత పోరాటంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న మరో దొంగ కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది.

Also Read : కోటాలో యువతి కిడ్నాప్ కేసు.. ట్విస్టులే ట్విస్టులు