వివేకానంద హత్యపై కుమార్తె సునీత ఫిర్యాదు
వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కడప : వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోదరుడు వైఎస్ అవినాశ్ రెడ్డితో కలిసి ఆమె పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన తండ్రి హత్యపై లోతుగా విచారణ జరిపించాలని పేర్కొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాన్న రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ప్రచారం చేస్తున్నారు. మా నాన్న ప్రచారాన్ని అడ్డుకునేందుకే ప్రత్యర్థులు కుట్ర పన్ని ఆయనను హత్య చేశారని అనుమానిస్తున్నాము’ అని వెల్లడించారు.
Read Also: వివేకా హత్య : ఆరోపణలు రుజువైతే నడిరోడ్డు పై కాల్చేయండి
వివేకానందరెడ్డిది హత్యేనని పోస్ట్మార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నాయని వైద్యులు నివేదికలో తెలిపారు. పదునైన ఆయుధంతో వైఎస్ వివేకానందరెడ్డి తల, శరీరంపై ఏడుసార్లు దాడి చేసినట్లు గుర్తించారు. నుదుటిపై లోతైన రెండు గాయాలు, తల వెనక భాగంలో మరో గాయం, తొడ భాగం, చేతిపైనా మరో గాయం అయినట్లు తెలుస్తోంది.