CBSE Board Exam 2025 : సీబీఎస్ఈ మార్కింగ్ స్కీమ్, శాంపిల్ పేపర్లు విడుదల.. అధికారిక నోటిఫికేషన్ ఇదిగో..!
CBSE Board Exam 2025 : మార్కింగ్ స్కీమ్ అనేది ఇంగ్లీష్, గణితం, హిందీ, సోషల్ సైన్స్, సైన్స్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొదలైన అన్ని ప్రధాన సబ్జెక్టులకు అందుబాటులో ఉంది.
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) రాబోయే బోర్డు పరీక్ష కోసం 10వ తరగతి, 12వ తరగతులకు నమూనా ప్రశ్న పత్రాలు (SQPs), మార్కింగ్ స్కీమ్ (MS) విడుదల చేసింది. 2024-25 బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మార్కింగ్ స్కీమ్, ప్రశ్నాపత్రాలను చెక్ చేయడానికి సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ను విజిట్ చేయొచ్చు.
మార్కింగ్ స్కీమ్ అనేది ఇంగ్లీష్, గణితం, హిందీ, సోషల్ సైన్స్, సైన్స్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొదలైన అన్ని ప్రధాన సబ్జెక్టులకు అందుబాటులో ఉంది. దాంతో పాటు విద్యార్థులు అస్సామీ వంటి సబ్జెక్టుల మార్కింగ్ విధానాన్ని కూడా చెక్ చేయవచ్చు. బెంగాలీ, భరతనాట్యం, భూటియా, హిందుస్థానీ సంగీతం (గాత్రం), కర్ణాటక సంగీతం-మధురమైన వాయిద్యాలు, కర్ణాటక సంగీతం-పెర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్, కర్ణాటక సంగీతం-గాత్రం, పెయింటింగ్, అరబిక్ మొదలైనవి ఉన్నాయి.
సీబీఎస్ఈ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. “బోర్డు 10వ తరగతి, 12వ తరగతులకు శాంపిల్ ప్రశ్న పత్రాలు (SQPs), మార్కింగ్ స్కీమ్లను (MS) జారీ చేస్తుంది. శాంపిల్ పేపర్ రూపకల్పన గురించి విస్తృత అవగాహనను అందిస్తాయి.
అంతకుముందు జూన్లో, సీబీఎస్ఈ 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వచ్చే వివిధ నైపుణ్య విషయాల కోసం పాఠ్యాంశాలు, కంటెంట్కు సవరణలను ప్రకటించింది. ఈ మార్పులు 11వ తరగతికి సంబంధించిన వెబ్ అప్లికేషన్, 10వ తరగతికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 9వ, 11వ తరగతులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులపై ప్రభావం చూపుతాయి. అధికారిక నోటిఫికేషన్లో సీబీఎస్ఈ బోర్డు ఈ అప్డేట్స్ గురించి వాటాదారులకు తెలియజేసింది. వివరణాత్మక సమాచారం కోసం బోర్డు వెబ్సైట్ను విజిట్ చేయాల్సిందిగా ప్రోత్సహించింది.
Read Also : ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటున్న గ్యాంగ్ అరెస్ట్.. రూ.5.6 కోట్లు వసూలు చేసిన ముఠా