India Post Jobs : ఇండియా పోస్టులో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్.. 10 పాసైతే చాలు.. నెలకు రూ. 29వేల వరకు జీతం.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

India Post Jobs : ఇండియాలో పోస్టులో పరీక్షలు రాయకుండానే ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం. దరఖాస్తుకు చివరి తేదీ 3 మార్చి 2025. అభ్యర్థులు వీలైనంత త్వరగా తమ దరఖాస్తును సమర్పించాలి.

India Post Jobs : ఇండియా పోస్టులో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్.. 10 పాసైతే చాలు.. నెలకు రూ. 29వేల వరకు జీతం.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

India Post GDS Recruitment 2025

Updated On : February 18, 2025 / 11:49 PM IST

India Post GDS Recruitment 2025 : ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు పడ్డాయి. గ్రామీణ్ డాక్ సేవక్ (GDS)లో సర్వెంట్ పోస్టులకు అద్భుతమైన అవకాశం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లోని యువత అప్లయ్ చేసుకోవచ్చు.

Read Also : iPhone SE 4 Launch : గుడ్ న్యూస్.. ఆపిల్ చౌకైన ఐఫోన్ SE4 వచ్చేస్తోంది.. ఫిబ్రవరి 19నే లాంచ్.. ఏఐ ఫీచర్లపై ఇంట్రెస్టింగ్ అప్‌‌డేట్..!

మొత్తం 21,413 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన యువతకు మాత్రమే అవకాశం. ఎందుకంటే ఈ నియామకంలో రాత పరీక్ష ఉండదు. 10వ తరగతి మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేసి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు, చివరి తేదీ :
ఇండియా పోస్ట్‌‌లో ఈ ఖాళీకి దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ 3 మార్చి 2025. వివిధ పోస్టులపై నియామకాలు జరుగుతాయి. ప్రధానంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) లేదా పోస్టల్ సర్వెంట్ పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టుల సంఖ్యలో వివిధ కేటగిరీల అభ్యర్థులకు నిర్దేశించిన సంఖ్యను కూడా విడుదల చేశారు. తద్వారా అన్ని వర్గాలకు అవకాశాలు లభిస్తాయి.

అర్హత ప్రమాణాలు, వయోపరిమితి :
ఈ నియామకానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, వారు దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్రంలోని స్థానిక భాషపై వారికి పరిజ్ఞానం ఉండాలి. ఎందుకంటే అదే భాష వారి 10వ తరగతి చదువులకు ఆధారం. వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 40 సంవత్సరాల వరకు నిర్ణయించారు. అయితే, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది కానీ, రాష్ట్రం వెలుపలి అభ్యర్థులకు ఎలాంటి సడలింపు ఉండదు.

జీతం ఎంతంటే? :
ఎంపికైన అభ్యర్థులకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)కు నెలకు రూ. 12వేల నుంచి రూ. 29,380 వరకు ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/డాక్ సేవక్ కు రూ. 10వేల నుంచి రూ. 24,470 వరకు జీతం ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష లేదు :
అభ్యర్థులు 10వ తరగతి మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ జాబితా నుంచి ఎంపిక అవుతారు. రాత పరీక్ష ఉండదు. 10వ తరగతిలో మంచి మార్కులతో రాణించిన అభ్యర్థులకు అవకాశం లభిస్తుంది.

Read Also : Mahashivratri 2025 : మహాశివరాత్రి రోజు శివలింగానికి జలాభిషేకం ఎలా చేయాలి? నియమాలేంటి? ఎలా పూజిస్తే ఐశ్యర్యం కలుగుతుంది?

దరఖాస్తు రుసుము :
జనరల్, ఓబీసీ, ఇతర నాన్-రిజర్వ్డ్ అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ సమయంలో రూ. 100 దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC, ST, PWD, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము మినహాయింపు ఉంటుంది. ఈ అవకాశం అన్ని వర్గాల అభ్యర్థులకు అందుబాటులో ఉంది.

దరఖాస్తు ప్రక్రియ ఇలా :

  • అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (indiapostgdsonline.gov.in)ని విజిట్ చేయండి.
  • దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన అన్ని సమాచారాన్ని నింపండి.
  • అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • దరఖాస్తు సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవడం మర్చిపోవద్దు.