డోంట్ మిస్ : ఏప్రిల్ 18న మోడల్ స్కూల్స్ ఎంట్రెన్స్ టెస్ట్

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 10:26 AM IST
డోంట్ మిస్ : ఏప్రిల్ 18న మోడల్ స్కూల్స్ ఎంట్రెన్స్ టెస్ట్

Updated On : April 10, 2019 / 10:26 AM IST

ఏప్రిల్ 18న తెలంగాణలోని మోడల్ స్కూల్స్ లో ప్రవేశాల కోసం రాత పరీక్ష నిర్వహించనున్నట్టు మోడల్‌ స్కూల్స్‌ డైరెక్టర్‌ ఏ. సత్యనారాయణ రెడ్డి తెలిపారు. అందుకు 18న తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 6వ తరగతికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; 7 నుంచి 10వ తరగతుల వారికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 

పరీక్ష రాయడానికి మొత్తం 1.10 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 6వ తరగతి కోసం 55 వేల మంది విద్యార్థులు, మిగిలిన తరగతులన్నింటికీ కలిపి 55 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ 10 తేదీ సాయంత్రం 6 గంటల నుంచి హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నాయి. పరీక్ష ముందు వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

పరీక్ష విధానం:
తెలుగు, ఇంగ్లీష్, మధ్యమాల్లో వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. వీటిలో వచ్చిన మార్కుల ప్రకారం ప్రవేశానికి అవకాశం కల్విస్తారు. అన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికెట్, కుల, ఆదాయ సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలి.