Assembly Elections 2023: ఈసారి ఓటింగ్ తగ్గింది.. ఛత్తీస్‌గఢ్‌‭, మిజోరాంలలో నమోదైన పోలింగ్ ఎంతంటే?

ఛత్తీస్‌గఢ్‌‭లో అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. ఇక మిజోరాంలో పూర్తిగా సానుకూల వాతావరణంలో పోలింగ్ ముగిసినట్లు ఆ రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి ప్రకటించారు

Assembly Elections 2023: ఈసారి ఓటింగ్ తగ్గింది.. ఛత్తీస్‌గఢ్‌‭, మిజోరాంలలో నమోదైన పోలింగ్ ఎంతంటే?

Updated On : November 7, 2023 / 9:10 PM IST

Assembly Elections 2023: మిజోరాం అసెంబ్లీ సహా ఛత్తీస్‌గఢ్‌‭లోని 20 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం జరిగిన పోలింగ్ ముగిసింది. అయితే ఈసారి పోలింగ్ తక్కువగా నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇరు రాష్ట్రాల్లో చాలా తక్కువ పోలింగ్ నమోదు అయింది. ఛత్తీస్‌గఢ్‌‭లో 2018 77.23 శాతం పోలింగ్ నమోదు అవగా.. ఈసారి కేవలం 71.11 (కేవలం 20 నియోజకవర్గాలు మాత్రమే) శాతమే నమోదు అయింది. ఇక మిజోరాం అసెంబ్లీకి 2018లో 80.03 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ సారి కేవలం 77.39 శాతమే నమోదు అయింది.

ఛత్తీస్‌గఢ్‌‭లో అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. ఇక మిజోరాంలో పూర్తిగా సానుకూల వాతావరణంలో పోలింగ్ ముగిసినట్లు ఆ రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి ప్రకటించారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా చెప్పుకుంటున్న ఈ అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ ఈరోజే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే ఇది సమస్యాత్మకానికి వెళ్లకుండా పూర్తి సానుకూల వాతావరణంలో ముగియడం పట్ల ఎన్నికల సంఘం హర్షం వ్యక్తం చేసింది.