తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు : డీఎంఈ

గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పై డీఎంఈ రమేష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : February 8, 2020 / 09:41 AM IST
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు : డీఎంఈ

Updated On : February 8, 2020 / 9:41 AM IST

గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పై డీఎంఈ రమేష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణకిస్తోంది. చైనాను కరోనా పట్టిపీడిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ అనుమానిత కేసులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ ను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. అనుమానితులు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేరారు. గాంధీ ఆస్పత్రిలో, ఫీవర్ ఆస్పత్రిలో అనుమానితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఎరికి కూడా కరోనా వైరస్ లేదని నిర్ధారణ అయింది. 

గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పై డీఎంఈ రమేష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. కరోనాపై వస్తున్న వదంతులు నమ్మొద్దన్నారు. కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చాక కూడా 14 రోజులు హోమ్ ఐసోలేష్ లో ఉండాలని సూచించారు. ఎటువంటి విపత్తులను ఎదుర్కొనేందుకైనా వైద్యశాఖ సిద్ధంగా ఉందన్నారు. 

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణకిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా భారత్ లోని తెలంగాణ రాష్ట్రం కూడా నగరంలోని గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసొలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ రోగుల కోసం రెండో వార్డును అధికారులు సిద్ధం చేస్తున్నారు. పది మంది రోగులకు చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వైద్య విద్యా శాఖ డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదుకాలేదున్నారు. అయినా అప్రమత్తంగా ఉన్నామని రమేశ్‌రెడ్డి తెలిపారు.

ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో కరోనా అనుమానిత కేసులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కోన్నారు. మాస్క్‌లతోపాటు డిస్పోజబుల్‌ డ్రస్సులు కూడా అందుబాటులో ఉంచామన్నారు. కరోనా వైరస్‌ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందని, ఈకారణంగా వైద్య సిబ్బందిని తప్ప ఇతరులెవరిని ఆ వార్డులోకి అనుమతించడం లేదని అస్పత్రి అధికారులు చెప్పతున్నారు.