కారెక్కనున్న సబిత: ఓవైసీ ఇంట్లో కేటీఆర్‌తో భేటీ

  • Published By: vamsi ,Published On : March 10, 2019 / 07:49 AM IST
కారెక్కనున్న సబిత: ఓవైసీ ఇంట్లో కేటీఆర్‌తో భేటీ

Updated On : March 10, 2019 / 7:49 AM IST

పార్లమెంటు ఎన్నికలు వస్తున్న తరుణంలో నేతలు పార్టీలు మారేందుకు ఇదే అనువైన సమయం అని భావించి టీఆర్‌ఎస్ గూటికి చేరేందుకు సిద్దం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గులాబీ పార్టీ తీర్ధం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఆమె తన కూమారుడు కార్తీక్ రెడ్డితో కలిసి టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్‌తో భేటి అయినట్లు తెలుస్తుంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ నివాసంలో వీరంతా భేటీ అయ్యారు.

పార్లమెంటు ఎన్నికల తర్వాత సబితా ఇంద్రారెడ్డికి మంత్రిగా అవకాశం ఇవ్వవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఊహించిని పరిణామంతో కాంగ్రెస్‌కు షాక్ తగిలినట్లు అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో 16సీట్లు గెలవాలనే కసితో ఉన్న టీఆర్‌ఎస్ ఈ మేరకు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే.