సంక్రాంతి స్పెషల్ : హైదరాబాద్ నుంచి రైళ్లు
సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి-కాకినాడ మధ్య జనసాధారణ్ రైళ్లను నడపనుంది.

సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి-కాకినాడ మధ్య జనసాధారణ్ రైళ్లను నడపనుంది.
సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేకరైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి-కాకినాడ మధ్య జనసాధారణ్ రైళ్లను నడపనుంది. లింగంపల్లి నుంచి మూడు సర్వీసులు కాకినాడకు, నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్కు ఒక రైలు, సికింద్రాబాద్ నుంచి మరో అదనపు రైలు విజయవాడకు ప్రకటించారు. ఈ రైళ్లు ఆదివారం అందుబాటులో ఉంటాయని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. రేపు కూడా లింగంపల్లి-కాకినాడ మధ్య జనసాధారణ్ రైళ్లు నడవనున్నాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
సంక్రాంతి పండుగ రద్దీని పురస్కరించుకుని నరసాపురం-సికింద్రాబాద్ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఇంతకముందే ఒక ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. ఈ రైళ్లు వయా నల్గోండ, గుంటూరు, వరంగల్ మీదుగా ప్రయాణించనున్నాయి. జనవరి 10, 11, 12, 13 తేదీల్లో ఈ స్పెషల్ రైళ్లు బయలుదేరనున్నాయి. తిరుగు ప్రయాణంలో నరసాపురం నుంచి జనవరి 18, 19 తేదీల్లో నడవనున్నాయి. సికింద్రాబాద్ లో రైలు బయలుదేరే సమయాల్లో స్వల్ప వ్యత్యాసం ఉంది.
ఈ ఎక్స్ప్రెస్ రైలు జనవరి 12, 13 తేదీల్లో 07256 నెంబర్తో రాత్రి 7.25 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి ఉదయం 6 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. 18వ తేదీన 07255 నెంబర్తో నరసాపురంలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ఎక్స్ప్రెస్ గుంటూరు,నల్గోండ మీదుగా హైదరాబాద్ వెళ్లనుంది.
జనవరి 19న నరసాపురంలో రాత్రి 8.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు సికింద రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు వరంగల్, ఖమ్మం మీదుగా వెళ్తుంది. ఈ ఆరు ఎక్స్ప్రెస్ రైళ్లకు అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. అన్లైన్ లేదా రిజర్వేషన్ కౌంటర్లలో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చునని రైల్వే అధికారులు తెలిపారు.