హడావుడి వద్దు.. జెండా ఆవిష్కరించండి చాలు: కేటీఆర్

తెలంగాణ రాష్టంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ వేడుకలు ఘనంగా జరుగుతాయిన అందరూ భావించారు. అయితే హడావుడి లేకుండా నిరాడంబరంగా వేడుకులను జరుపుకోవాలని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సూచిందించింది. ఏప్రిల్ 27వ తేదీన టీఆర్ఎస్ పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది.
అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమం మాత్రమే నిర్వహించుకోవాలని కేటీఆర్ సూచించారు.
గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు నిర్వహించుకోవచ్చని పార్టీ వారికి తెలిపింది. వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమంను నిర్వహించుకోవాలని తెలిపారు.