Chiranjeevi Oxygen Bank : తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులు..
కోవిడ్ 19 కారణంగా నెలకొన్న ఆక్సిజన్ కొరతను అరికట్టడానికి మెగాస్టార్ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్లు ఏర్పాటు చెయ్యనున్నారు..
Chiranjeevi Oxygen Bank: కోవిడ్ 19 కారణంగా నెలకొన్న ఆక్సిజన్ కొరతను అరికట్టడానికి మెగాస్టార్ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్లు ఏర్పాటు చెయ్యనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్లు ఏర్పాటు చేస్తున్నట్టు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు తెలియజేశారు. ఈ ఆక్సిజన్ బ్యాంక్లను మెగా పవర్స్టార్ రామ్ చరణ్ పర్యవేక్షించనున్నారు.
Chiranjeevi : కారవ్యాన్ డ్రైవర్ కుటుంబానికి చిరంజీవి సాయం..
రక్తం దొరక్క ఎవరు మరణించకూడదనే సంకల్పంతో 1998 లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నెలకొల్పారు. ఈ కరోనా కష్ట కాలంలో ఆక్సిజన్ అందక ఎవరు మరణించకూడదనే సంకల్పంతో ప్రతి జిల్లాలోను చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకును నెలకొల్పాలని నిర్ణయించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో ఓ బృహత్తర ప్రణాళికను రూపొందించారు. అలా యుద్దప్రాతిపదికన ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటవుతోంది.
వారం రోజుల్లో ఈ బ్యాంక్ తన సేవలను ప్రారంభించబోతోంది. ఆ ఆక్సిజన్ బ్యాంక్ పర్యవేక్షణ బాధ్యత అంతా రామ్ చరణ్ పర్యవేక్షిస్తారు. మెగా అభిమానులను కూడా ఇందులో భాగస్వాముల్ని చేయబోతున్నారు. ఆయా జిల్లాల అభిమాన సంఘాల అధ్యక్షులు అక్కడ వీటి నిర్వహణ బాధ్యత చూస్తారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటవుతోంది. దీని అధికారిక ప్రకటనను ట్విట్టర్ ద్వారా రామ్ చరణ్ విడుదల చేశారు. తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంటును కూడా ప్రారంభించారు. ఇప్పుడున్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అరికట్టే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించబోతున్నట్లు వివరించారు.
In the current Covid situation to prevent deaths from lack of Oxygen supply @KChiruTweets has decided to start Chiranjeevi Oxygen Banks at district level.Efforts are on to make these operational within a week’s time. #Covid19IndiaHelp #ChiruForCovidhelp pic.twitter.com/9aPU56rFco
— ChiranjeeviCharitableTrust (@Chiranjeevi_CT) May 20, 2021