Indian Army adds new weapons : తూర్పు లడఖ్ ప్రాంతంలో ఆర్మీ కొత్త యుద్ద ట్యాంకుల మోహరింపు
భారత సైన్యం చైనా లడఖ్ ప్రాంతంలో కొత్త యుద్ధట్యాంకులు, ఆయుధాలను మోహరించింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచడానికి కొత్త పరికరాలు, ఆయుధాలను ఆర్మీ రంగంలోకి దించింది.....
Indian Army adds new weapons : భారత సైన్యం చైనా లడఖ్ ప్రాంతంలో కొత్త యుద్ధట్యాంకులు, ఆయుధాలను మోహరించింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచడానికి కొత్త పరికరాలు, ఆయుధాలను ఆర్మీ రంగంలోకి దించింది. 14,500 అడుగుల ఎత్తులో ఉన్న మిలటరీ స్టేషన్ వద్ద కొత్త ఆయుధ వ్యవస్థ, పరికరాలను ఏర్పాటు చేసింది. (Eastern Ladakh for operations in region) అధునాతనంగా రూపొందించిన మేడ్ ఇన్ ఇండియా ధనుష్ హూవిట్టరును భారత సైన్యం ప్రవేశపెట్టింది.
ధనుష్ హూవిట్జర్ 48 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను చేధించగలదని, దీన్ని లడఖ్ సెక్టార్ రెజిమెంటులో చేర్చామని కెప్టెన్ వి మిశ్రా చెప్పారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు అభివృద్ధి చేసి ఉత్పత్తి చేసిన 114 తుపాకులు కూడా భారత సైన్యంలో చేరనున్నాయి. ఎదురుకాల్పుల సమయంలో ప్రత్యర్థి దళాలు వేగంగా కదిలే వాహనాలను రంగంలోకి దింపాయి.
ఎం 4 క్విక్ రియాక్షన్ ఫోర్స్ వాహనాలను తూర్పు లడఖ్ సెక్టారులోని ఫార్వర్డ్ ప్రాంతంలో చేర్చాయి. శత్రు ట్యాంకుల సాయుధ పోరాట వాహనాలను ఎదుర్కోవడానికి దళాలను సన్నద్ధం చేయడానికి, భారత సైన్యం తూర్పు లడఖ్ సెక్టార్లో స్పైక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను రంగంలోకి దించింది.