MLC Kavitha: ప్రధాని మోదీకి ఎమ్మెల్సీ కవిత లేఖ.. ఎనిమిది ప్రశ్నలకు సమాధానం చెప్పండి..
ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య రాజకీయ వైరం కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఈ క్రమంలో..
MLC Kavitha: ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య రాజకీయ వైరం కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఈ క్రమంలో అధికార తెరాస పార్టీ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల అమిత్ షా, మోదీలు తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని, ప్రజలంతా ఏకమైన కుటుంబ పాలనకు స్వస్తి పలకాలంటూ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు తెరాస ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలకు చేసిన మేలు ఏమీలేదంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా, లేఖ ద్వారా ప్రధాని మోదీకి ఎనిమిది ప్రశ్నలు సంధించారు.
8 साल – जनता बेहाल !
My 8 questions to PM Modi Ji and his Government on the promises that were never kept
1. Empowering Nari Shakti by giving them an equal footing. Where is the Women reservation Bill, Modi ji?
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 30, 2022
గత ఎనిమిది సంవత్సరాల పరిపాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజారంజక పాలన సాగించడంలో పూర్తి విఫలమైందని కవిత విమర్శించారు. మహిళా శక్తికి సమాన ప్రాధాన్యత కల్పించడం ద్వారా వారికి సాధికారత కల్పించడంలో బీజేపీ విఫలమైందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎక్కడ ఉంది మోడీ గారూ అంటూ కవిత ప్రశ్నించారు. మన దేశ జీడీపీ పడిపోతున్నా, జీడీపీ, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు అమాంతంగా పెరుగుతున్నాయని, విచిత్రంగా అవి దేశ ప్రభుత్వ నియంత్రణలో ఎందుకు లేవంటూ కవిత మోదీని ప్రశ్నించారు. భారీగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టారంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వ పక్షపాతానికి ముగింపు ఎప్పుడు మోదీ జీ అంటూ కవిత నిలదీశారు. తెలంగాణకు రావాల్సిన రూ.7000 కోట్ల పెండింగ్ నిధులను బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో చెప్పాలంటూ అడిగారు.
MLC Kavitha: సగర్వంగా, ధీటుగా సమాధానం చెప్పాలి – ఎమ్మెల్సీ కవిత
ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుందని, “మెహంగై ముక్త్ భారత్” అని ప్రకటించుకున్న మీరు అసలు అలాంటి “అచ్ఛే దిన్” ఎప్పుడు తెస్తారంటూ కవిత ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, భారతదేశ ప్రజలకు కృత్రిమ ప్రచారాలులేని నిజమైన “అమృత్ కాల్” ఎప్పుడు వస్తుందో చెప్పాలన్నారు. రైతులు భారతదేశానికి గుండె చప్పుడని, కానీ ఈరోజు తెలంగాణలోని వరి రైతులు, పసుపు రైతులు తమ కష్టానికి కనీస గుర్తింపును కోరినందుకు బీజేపీ చేతిలో నష్టపోతున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వ.. న్యూ ఇండియా యొక్క వాస్తవికత ఎలా ఉందంటే.. కోట్లాది మంది భారతీయులు తమకు కనీస ఆదాయం అందించే ఉపాధిని పొందడంలో కష్టపడుతున్నారని అన్నారు. పీఎం కేర్ పథకంలో దేశ ప్రజలకు నిధుల గురించిన నిజమైన సమాచారం ప్రజలకు తెలియజేసే రోజు వస్తుందా మోదీజీ అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.