ఆగస్టు తర్వాతే స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్
లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మూతపడిన స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ ఎప్పుడు అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై క్లారిటీ కోసం 33 కోట్ల మంది విద్యార్థులు,

లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మూతపడిన స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ ఎప్పుడు అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై క్లారిటీ కోసం 33 కోట్ల మంది విద్యార్థులు,
లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మూతపడిన స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ ఎప్పుడు అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై క్లారిటీ కోసం 33 కోట్ల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై స్పష్టత ఇచ్చారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్. ఆగస్టు తర్వాతే స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ చేస్తామని ఆయన చెప్పారు. జూన్ 3న జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయనీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఇండియా టుడే తెలిపింది. ఇంతకు ముందు జరిగిన పరీక్షలతోపాటు ఇప్పుడు నిర్వహిస్తున్న పరీక్షల ఫలితాలను ఆగస్టు 15లోగా ప్రకటించాలని ప్రయత్నిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5 అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి 5వ దశ లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. లాక్ డౌన్ 5 లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం స్కూళ్లు, కాలేజీలను 30 శాతం అటెండెన్స్తో జులైలో రీఓపెన్ చేస్తారని, 8వ తరగతిలోపు స్టూడెంట్స్ ఇళ్ల దగ్గరే ఉంటారని భావించారు. అలాగే గ్రీన్, ఆరెంజ్ జోన్స్లోనూ విద్యా సంస్థలు మళ్లీ తెరుస్తారని.. భౌతిక దూరం పాటిస్తూ, తక్కువ అటెండెన్స్తో రెండు షిఫ్ట్స్ మధ్య క్లాసుల నిర్వహణ ఉంటుందని అనుకున్నారు. కానీ ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ ఓ రేంజ్ లో ఉంది. రోజురోజుకి రికార్డ్ స్థాయిలో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విద్యా సంస్థలు రీఓపెన్ చేస్తే పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడేసినట్టు అవుతుంది. దీంతో విద్యా సంస్థల పున: ప్రారంభం ఆలస్యమవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జులై 1 నుంచి 15వ తేదీ వరకు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ/ఐఎస్సీ ఎగ్జామ్స్ జరగాల్సి ఉండగా.. జులై 26న నీట్, అదే నెల 18 నుంచి 23 వరకు జేఈఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.