Postal Ballot TRS lead : మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. టీఆర్ఎస్ 228, బీజేపీ 224 ఓట్లు, కాంగ్రెస్ 136 ఓట్లు సాధించాయి.

Postal Ballot TRS lead : మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం

postal ballot TRS lead

Updated On : November 6, 2022 / 9:16 AM IST

Postal Ballot TRS lead : మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. టీఆర్ఎస్ 228, బీజేపీ 224 ఓట్లు, కాంగ్రెస్ 136 ఓట్లు సాధించాయి. రెండు టేబుళ్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. ఈవీఎం మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది.

ఈవీఎం ఓట్లను లెక్కించేందుకు 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. తొలి రౌండ్ లో చౌటుప్పల్ మండలం ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 15 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. మునుగోడు నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 298 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Munugode Bypoll Counting: మరికొద్ది గంటల్లో బైపోల్ ఫలితం.. గెలుపుపై ఎవరి దీమా వారిదే

ప్రధాన పార్టీల అభ్యర్థులుగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి(టిఆర్ఎస్), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(బిజెపి), పాల్వాయి స్రవంతి(కాంగ్రెస్), ఆనందాచారీ (బీఎస్పీ) ఉన్నారు. గురువారం(నవంబర్3,2022) మునుగోడు ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 2,41,855 ఓట్లకుగానూ 2,25,192 ఓట్లు (93.16%) పోల్ అయ్యాయి.