ysrcp: వైసీపీ ప్లీనరీలో ప్రసంగించనున్న విజయమ్మ.. చాలా కాలం తర్వాత పార్టీ కార్యక్రమానికి..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 8, 9న నిర్వహించే మూడో ప్లీనరీకి ఏర్పాటు పూర్తవుతున్నాయి. గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ప్లీనరీ నిర్వహించనున్నారు.
ysrcp: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 8, 9న నిర్వహించే మూడో ప్లీనరీకి ఏర్పాటు పూర్తవుతున్నాయి. గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ప్లీనరీ నిర్వహించనున్నారు. అయితే, వైసీపీ ప్లీనరీకి ఆ పార్టీ నాయకురాలు విజయమ్మ హాజరవుతారా? లేదా? అన్న సందేహాలు ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉన్నాయి. ఆమె వస్తున్నారని ఇవాళ అధికారికంగా ప్రకటన వెలువడింది.
Telangana: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం
రెండవ రోజు ప్లీనరీలో విజయమ్మ ప్రసంగించనున్నారు. ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు (30 నిమిషాల పాటు) ఆమె ప్రసంగిస్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు విజయమ్మ దూరంగా ఉంటున్నారు. విజయమ్మ వస్తారా? రారా? అని నిన్నటి వరకూ పార్టీలో చర్చ జరిగింది. విజయమ్మ ప్లీనరీకి వస్తున్నారని తెలియడంతో పార్టీ క్యాడర్లో జోష్ నిండింది.