Turmeric : చలికాలంలో రోగనిరోధక వ్యవస్ధ బలోపేతానికి పసుపు

సైనసైటిస్‌తో బాధపడుతున్న చాలా మంది చలికాలంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటారు. విశ్రాంతి లేకపోవడం, తలనొప్పిని అనుభవిస్తారు.

Turmeric : చలికాలంలో రోగనిరోధక వ్యవస్ధ బలోపేతానికి పసుపు

Turmaric

Updated On : December 25, 2021 / 12:23 PM IST

Turmeric : చలికాలంలో పసుపుని తప్పకుండా వంటలలో చేర్చుకోవాలి. ఇది మంచి యాంటీ బయాటిక్. సీజనల్‌ వ్యాధులతో పోరాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటే ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. పసుపు పలు ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా చెప్పవచ్చు. ఎందుకంటే దీనిని పురాతన కాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తున్నారు. వేలాది ఏళ్లుగా భారతీయులు పసుపును ఔషధంగా ఉపయోగిస్తున్నారు. పసుపులో లభించే కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌తోపాటు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే గుణాలున్నాయి. అనేక ఔషధాల తయారీలో వాడుతున్నారు. చలికాలంలో పసుపును ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆసక్తికరమైన ప్రయోజనాలను తెలుసుకుందాం.

పసుపును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. చలికాలపు సైనస్‌లు, కీళ్ల నొప్పులు, అజీర్ణం మరియు జలుబు మరియు దగ్గు. తక్షణ ఉపశమనం కోసం, మీరు పాలు మరియు టీ వంటి పానీయాలలో చిటికెడు పసుపును వేసుకుని తాగితే ఉపసమనం లభిస్తుంది. ఫ్లూ నుంచి కాపాడుతుంది. చలికాలంలో తరచుగా జలుబు, దగ్గును ఎదుర్కోవలసి వస్తుంది. పసుపు పాలు సహజ ఔషధంగా పనిచేస్తాయి. గర్భిణీలు తరచుగా పసుపు పాలను తాగాలి. పసుపు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. గొంతు నొప్పిని తగ్గిస్తుంది. పసుపు శ్వాసకోశ మార్గాన్ని శుభ్రపరుస్తుంది. కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా ఇది జలుబు, దగ్గుతో పోరాడడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియలో సహాయపడుతుంది. పసుపు తినడం వల్ల మీ చర్మం ఆరోగ్యకరమైన మెరుపును ఇస్తుంది ఎందుకంటే ఇది శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. చలికాలం రోగాలు రాకుండా ఉండాలంటే కొవ్వు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పసుపు ఆహారం రుచిని పెంచుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది చర్మం మెరిసేలా చేస్తుంది. ఇది శరీరం నుంచి విషాన్ని బయటకు పంపిస్తుంది.

పసుపు సహజ పదార్ధం. ఇది సాధారణ జలుబు సైనస్, బాధాకరమైన కీళ్ళు, అజీర్ణం, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు పాలు, టీ వంటి పానీయాలలో చిటికెడు పసుపును కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది. పసుపును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

సైనసైటిస్‌తో బాధపడుతున్న చాలా మంది చలికాలంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటారు. విశ్రాంతి లేకపోవడం, తలనొప్పిని అనుభవిస్తారు. రోజూ ఒక గ్లాసు పసుపు పాలు తాగడం వల్ల సైనస్ చికాకు, అసౌకర్యం నుంచి ఉపశమనం దొరుకుతుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరానికి లోపలి నుంచి మేలు చేస్తాయి. కాలేయ పనితీరును మెరుగుపరచడంలో పసుపు సహాయపడుతుంది. కాలేయ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. అందుకే పసుపును క్రమం తప్పకుండా తీసుకోవాలి.

బరువును అడ్డుకోవడంలో పసుపు ఉపయోగపడుతుందని ఎలుకలపై చేసిన పరిశోధనలో తేలింది. కొవ్వును కరిగించడంలో, ఒబేసిటీ బారిన పడకుండా చూడటంలో పసుపు టీ ఉపయుక్తంగా ఉంటుంది. ఇది డయాబెటిస్‌ను అడ్డుకోవడంలోనూ సహాయ పడుతుంది. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు ఆర్థరైటీస్ బారిన పడకుండా చూస్తాయి. ఆర్థరైటిస్ లక్షణాలను ఇవి తగ్గిస్తాయి. పసుపు టీని చాలా తేలిగ్గా చేయొచ్చు. 3-4 కప్పుల నీటిని వేడి చేసి, 1-2 టీ స్పూన్ల పసుపు పొడిని కలపాలి. దాదాపు పది నిమిషాలపాటు ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. తర్వాత దాన్ని గిన్నెలోకి తీసుకొని 5 నిమిషాలపాటు చల్లార్చాలి. దీనికి అల్లం ముక్క, కొంచెం తేనె కూడా కలపొచ్చు. చలికాలంలో ఇలా చేసిన పసుపు టీని రోజూ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది.