Anushka : క్రిష్ దర్శకత్వంలో మళ్ళీ అదే పాత్ర చేస్తున్న అనుష్క.. ‘వేదం’ సీక్వెల్..!

అనుష్క క్రిష్ దర్శకత్వంలో మళ్ళీ అదే పాత్ర చేస్తున్నారా. వేదం సీక్వెల్ ని తీసుకు రాబోతున్నారా..?

Anushka : క్రిష్ దర్శకత్వంలో మళ్ళీ అదే పాత్ర చేస్తున్న అనుష్క.. ‘వేదం’ సీక్వెల్..!

Anushka Shetty movie with Krish Jagarlamudi is vedam sequel

Anushka : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇంకా రాలేదు. కానీ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది.

లేడీ ఓరియంటెడ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుందట. ఇక ఈ చిత్రానికి ‘శీలావతి’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టైటిల్ వింటుంటే.. అనుష్క మరోసారి వేశ్య పాత్రని పోషిస్తుందా..? అనే సందేహం కలుగుతుంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదం’ సినిమాలో అనుష్క.. సరోజ అనే వేశ్య పాత్రని పోషించారు. ఇప్పుడు శీలావతి టైటిల్ వింటుంటే.. మరోసారి అనుష్క వేశ్యగా కనిపించబోతుందని తెలుస్తుంది.

Also read : Ooru Peru Bhairavakona : ‘ఊరుపేరు భైరవకోన’ రివ్యూ.. భయపెట్టి.. నవ్వించి.. మెప్పించారా?

ఇక ఈ టైటిల్ విన్న తరువాత మరో సందేహం కూడా కలుగుతుంది. ఈ చిత్రం ‘వేదం’కి సీక్వెల్ గా రాబోతోందా..? అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే, వేదం మూవీలో మొత్తం ఐదు పాత్రలు ఉండగా.. వాటిలో అల్లు అర్జున్, మంచు మనోజ్ పాత్రలు చనిపోయి ముగిసిపోతాయి. మిగిలిన మూడు పాత్రల్లో ముఖ్యమైన రోల్ అనుష్క పోషించిన ‘సరోజ’. ఇప్పుడు ఈ పాత్రని లీడ్ రోల్ లో చూపిస్తూనే.. క్రిష్ సినిమా తెరకెక్కిస్తున్నారా అనే సందేహం కలుగుతుంది.

మరి దర్శకుడు క్రిష్.. శీలావతిని వేదంకి సీక్వెల్ గా తీసుకు వస్తున్నారా..? లేదా వేరే కథతో రూపొందిస్తున్నారా..? అనేది తెలియాల్సి ఉంది. కాగా క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రెజెంట్ పవన్ రాజకీయ షెడ్యూల్స్ లో బిజీగా ఉండడంతో.. వీరమల్లుకి బ్రేక్ ఇచ్చి అనుష్కతో మూవీని పట్టాలు ఎక్కించారు.