Sai Rajesh : పవన్ అభిమానికి సహాయం చేసిన బేబీ దర్శకుడు.. 50,000 సెండ్ చేసి..
సహాయమంటూ అడిగిన పవన్ కళ్యాణ్ అభిమానికి బేబీ దర్శకుడు సాయి రాజేష్ 50,000 సెండ్ చేసి..
![Sai Rajesh : పవన్ అభిమానికి సహాయం చేసిన బేబీ దర్శకుడు.. 50,000 సెండ్ చేసి.. Sai Rajesh : పవన్ అభిమానికి సహాయం చేసిన బేబీ దర్శకుడు.. 50,000 సెండ్ చేసి..](https://10tv.in/wp-content/uploads/2023/08/Baby-Movie-Director-Sai-Rajesh-help-pawan-kalyan-fan.jpg)
Baby Movie Director Sai Rajesh help pawan kalyan fan
Sai Rajesh : ఇటీవల రిలీజ్ అయిన బేబీ (Baby) సినిమాతో డైరెక్టర్ సాయి రాజేష్ ఆడియన్స్ లో మంచి గుర్తింపుని సంపాదించుకుంటున్నాడు. అయితే ఆ మూవీ కంటే ముందు కలర్ ఫోటో (Color Photo) సినిమాని నిర్మించడమే కాకుండా కథని అందించి సూపర్ హిట్టు అందుకొని నేషనల్ అవార్డుని కూడా అందుకున్నాడు. ఇక అంతకుముందు సంపూర్ణేష్ బాబుతో హృదయకాలేయం, కొబ్బరిమట్ట సినిమాలను కూడా తెరకెక్కించాడు. ప్రస్తుతం సాయి రాజేష్ సినిమాలు పై ఆడియన్స్ లో కూడా ఆసక్తి కనిపిస్తుంది.
Prabhas : ప్రభాస్ మళ్ళీ మారుతి సినిమా షూట్ మొదలుపెట్టనున్నాడా?.. మారుతి – ప్రభాస్ బ్యాక్ టు షూట్..
అయితే ఈ దర్శకుడు తన సినిమాలతోనే కాదు వ్యక్తితత్వంతో కూడా అభిమానులను సంపాదించుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ అభిమాని మేనల్లుడుకి గుండె ఆపరేషన్ కి డబ్బు అవసరం అవ్వడంతో సహాయం కోసం సోషల్ మీడియా వేదికలో ఒక పోస్ట్ వేశాడు. ఇక ఆ పోస్ట్ సాయి రాజేష్ వరకు చేరడంతో, అతను చూసి ఊరుకోకుండా అక్షరాలా రూ.50,000 అతనికి సెండ్ చేశాడు. అంతేకాకుండా మరికొంతమందిని కూడా సహాయం చేయాలని కోరాడు. దీంతో పవన్ అభిమానులతో పాటు నెటిజెన్స్ అందరూ సాయి రాజేష్ ని అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
Suriya : తెలుగు అభిమానులపై సూర్య స్పెషల్ పోస్ట్.. మీరు ఎప్పుడూ బెస్ట్..
Pls Amplify max…Donate even if its small amount ….Our own @PSPKFan2You nephew…They are rushing to Chennai now….
Donated 50k from my side… https://t.co/w0OTUhTa7N pic.twitter.com/pdN7sFE16P— Sai Rajesh (@sairazesh) August 3, 2023
ఇక బేబీ విషయానికి వస్తే.. SKN నిర్మాణంలో 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 77 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్స్ లో ఇంకా ఈ సినిమాకి ఆదరణ వస్తూనే ఉంది. ప్రస్తుతం మూవీ టీం సక్సెస్ టూర్ అంటూ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ సందడి చేస్తున్నారు. కాగా ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఎక్సట్రా ప్యాకేజీతో ఓటీటీలోకి రాబోతుంది. మూవీ రన్ టైం చాలా ఎక్కువ అవ్వడం వల్ల.. సినిమాలోని చాలా సన్నివేశాలు కట్ చేసేశారు. ఇప్పుడు ఆ సన్నివేశాలన్నిటిని యాడ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు.