Bindu Madhavi: ఓటీటీ బిగ్బాస్లో తెలుగమ్మాయి.. మళ్ళీ కమ్బ్యాక్ అవుతుందా?
ఫిబ్రవరి 26 నుండి బిగ్ బాస్ ఓటీటీ మొదలు కాబోతుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక, అగ్రిమెంట్స్ కూడా పూర్తవగా.. వారికి క్వారంటైన్ కూడా విధించినట్లు చెప్పుకుంటున్నారు.
Bindu Madhavi: ఫిబ్రవరి 26 నుండి బిగ్ బాస్ ఓటీటీ మొదలు కాబోతుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక, అగ్రిమెంట్స్ కూడా పూర్తవగా.. వారికి క్వారంటైన్ కూడా విధించినట్లు చెప్పుకుంటున్నారు. ఓటీటీ తొలి సీజన్ కు హైప్ తెచ్చేందుకు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లను రంగంలోకి దింపనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. పాత కొత్త కంటెస్టెంట్ల కలయికలో ఈ ఓటీటీ తొలి సీజన్ బిగ్ బాస్ షో ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా సమాచారం.
Bigg Boss OTT Telugu: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ప్రోమో రిలీజ్
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అరియనాతో పాటు మాజీ కంటెస్టెంట్లు ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీ రెజా, హరితేజలు కూడా ఓటీటీ బిగ్ బాస్ తొలి సీజన్ లో ఇంట్లోకి వెళ్లేందుకు సిద్దమైనట్లు వినిపిస్తుంది. కొత్తగా.. యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, డ్యాన్స్ షో ‘ఢీ-10’ విజేత రాజు, టిక్టాక్ స్టార్ దుర్గారావు, ‘సాఫ్ట్వేర్ డెవలపర్స్’వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాకర్ ప్రత్యూష పేర్లు ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి.
Bigg Boss : హిందీ బిగ్బాస్ విన్నర్ ఎవరో తెలుసా?.. విన్నర్కి క్యాష్ ప్రైజ్తో పాటు..
వీరే కాకుండా తెలుగు హీరోయిన్ బిందు మాధవిని కూడా ఓటీటీ తొలి సీజన్ లో స్పెషల్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి పంపనున్నట్లు తెలుస్తుంది. ఆవకాయ్ బిర్యానీతో ఫేమ్ తెచ్చుకున్న బిందుమాధవికి తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. అందుకే కోలీవుడ్ కి వెళ్లి అక్కడ ఎక్కువ ఆఫర్లు అందిపుచ్చుకుంది. అక్కడా ఈ మధ్య అవకాశాలు దక్కకపోవడంతో ఈ మధ్యే ఆహా వెబ్ సిరీస్ లో నటించి అటెన్షన్ క్రియేట్ చేసింది. క్రిష్ క్రియేషన్ లో `మస్తీ` వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన బిందు ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ ద్వారా మళ్ళీ క్రేజ్ తెచ్చుకునేందుకు సిద్దమైదని తెలుస్తుంది.