Janhvi Kapoor: హీరోయిన్ జాన్వీకి ఖరీదైన గిఫ్ట్.. ఎన్ని కోట్ల రూపాయలో, ఎవరిచ్చారో తెలుసా?
జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్ "పెద్ది" సినిమాలో నటిస్తోంది.

హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా రూ.5 కోట్ల విలువజేసే లంబోర్గినిని గిఫ్ట్గా అందుకుంది. ఆమెకు ఆ గిఫ్ట్ను ఆమెకు ఇచ్చింది ఎవరో కాదు సింగర్, ఎంటర్ప్రెన్యూర్ అనన్య బిర్లా.
జాన్వీ అందుకున్న ఈ కారుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లంబోర్గినిని ఓ వ్యక్తి జాన్వీ ఇంటికి వరకు డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తుండగా ఈ వీడియో తీశారు. లంబోర్గినిలో ఓ గిఫ్ట్ బాక్స్ను కూడా పంపింది అనన్య బిర్లా.
వ్యాపారవేత్త కుమార్ మంగళం, నీరజ బిర్లా కుమార్తె అనన్య బిర్లా. ఇటీవల అనన్య బిర్లా ఒ మేకప్ బ్రాండ్ను కూడా ప్రారంభించింది. ఈ కొత్త కంపెనీకి జాన్వీ కపూర్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే థ్యాంక్స్ చెబుతూ జాన్వీకి ఈ ఖరీదైన కారును పంపించినట్లు తెలుస్తోంది.
జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్ “పెద్ది” సినిమాలో నటిస్తోంది. అలాగే, మరిన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ ఆమె యాక్ట్ చేస్తోంది. మొదట బాలీవుడ్ సినిమాలకే ఈ ముద్దుగుమ్మ పరిమితం అవుతుందని అందరూ అనుకున్నారు.
ఆమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టింది. దేవర సినిమాలో ఆమె ఎన్టీఆర్ సరసన నటించింది. టాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపుతోంది. ఆమె ఫిట్నెస్, ఫ్యాషన్ వీడియోను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.
View this post on Instagram