బాహుబలి నిర్మాతలతో క్రిష్.. ఎన్టీఆరే హీరోనా?
కంగనా రనౌత్ తో మణికర్ణక సినిమా, తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ తర్వాత తీయబోయే సినిమాపై పలు కథనాలు వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా తీరక లేకుండా అటు మణికర్ణిక, ఇటు ఎన్టీఆర్ రెండు భాగాలుతో బాగా బిజీ బిజీగా గడిపిన క్రిష్.. బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో ఓ సినిమా చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని నెలలుగా తీరక లేకుండా అటు మణికర్ణిక, ఇటు ఎన్టీఆర్ రెండు భాగాలుతో బాగా బిజీ బిజీగా ఉన్నాడు. మహానాయకుడు రిలీజ్ అయిన వెంటనే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని ఫిక్స్ అయిన క్రిష్.. తదుపరి సినిమాలు ఎవరితో చేయాలి? అనే విషయంలో క్లారిటీకి వచ్చినట్లు చెబుతున్నారు.
ఇప్పటికే ఎలాంటి కథతో ఈ సినిమా తెరకెక్కించాలి అనే విషయంలో దర్శక నిర్మాతల మధ్య ఓ అవగాహన కుదిరినట్లు తెలుస్తుంది. అయితే అంతకంటే ముందు క్రిష్ తన సొంత సంస్థ అయిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తరవాత ఆర్కా మీడియా సినిమా చేసి తర్వాత బాహుబలి నిర్మాతలతో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈసారి పెద్ద హీరోతో చేయాలా? లేదంటే కొత్తవాళ్లతో ముందుకెళ్లాలా? అనే విషయంలో క్రిష్ ఇంకా నిర్దారణకు రాలేదని అంటున్నారు.
అయితే క్రిష్ దగ్గర మూడు స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. కథని బట్టి కథానాయకుడిని ఎంచుకోవడం క్రిష్ శైలి. అయితే తను తర్వాత సినిమాకు ఎవరిని తీసుకుంటారనే విషయం మాత్రం బయటకు రాలేదు. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ తో క్రిష్ సినిమా చేస్తున్నట్లు వార్తలు రాగా బాహుబలి నిర్మాతలతో క్రిష్ తీయబోయే సినిమా అదే అని తెలుస్తుంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకునిగా ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్.. ఆ సినిమా తర్వాతే ఈ సినిమాలో చేసే అవకాశం ఉంది. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే మాత్రం మరికొంత సమయం వెయిట్ చేయాల్సిందే.